News October 17, 2024

బెయిల్ కండీషన్.. ‘భారత్ మాతాకీ జై చెప్పాల్సిందే’

image

మధ్యప్రదేశ్‌లో ‘పాకిస్థాన్ జిందాబాద్.. హిందుస్థాన్ ముర్దాబాద్’ నినాదాలు చేసిన నిందితుడు ఫైజల్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు ముగిసే వరకు ప్రతి నెలా మొదటి, చివరి మంగళవారం మిస్రోడ్ పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినదిస్తూ అక్కడి జాతీయ జెండాకు 21సార్లు సెల్యూట్ చేయాలని స్పష్టం చేసింది. స్టేట్ కౌన్సిల్ బెయిల్‌కు అడ్డుచెప్పగా, న్యాయమూర్తి తోసిపుచ్చారు.

Similar News

News October 17, 2024

ఆ ప్లాంట్‌లో కోటి కార్లు ఉత్పత్తి చేశాం: మారుతి

image

హరియాణాలోని మానేసర్ ప్లాంట్‌ మొదలైనప్పటి నుంచి తమ సంస్థ అక్కడ కోటి కార్లను ఉత్పత్తి చేసిందని మారుతీ సుజుకీ ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం 18 ఏళ్లలోనే ఈ ఘనత సాధించినట్లు పేర్కొంది. గురుగ్రామ్, మానేసర్, గుజరాత్‌లో మారుతికి ఉత్పత్తి ప్లాంట్లున్నాయి. మానేసర్‌లో బ్రెజా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్ 6, సియాజ్, డిజైర్, వాగన్ ఆర్, ఎస్ ప్రెస్సో కార్లను తయారు చేసి భారత్‌తో పాటు విదేశాలకూ ఎగుమతి చేస్తోంది.

News October 17, 2024

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని చాలా జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, గద్వాల, కామారెడ్డి, యాదాద్రి, WGL, సూర్యాపేట, సిద్దిపేట, RR, కరీంనగర్, నల్గొండ, మెదక్, ఖమ్మం, నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల తదితర జిల్లాల్లో మోస్తరు వాన పడొచ్చని పేర్కొంది. కాగా ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

News October 17, 2024

గ్రూప్-1 మెయిన్స్ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

image

TG: గ్రూప్-1 పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సీఎస్ శాంతకుమారి సూచించారు. గ్రూప్-1 పరీక్షకు ఏర్పాట్లను సమీక్షించారు. మెయిన్స్‌కు 34,383 మంది అభ్యర్థులు హాజరవుతారని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించారు. మెయిన్స్ నిర్వహణకు 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద పటిష్ఠ బందోబస్తుతో పాటు విస్తృత పర్యవేక్షణ ఉండాలన్నారు.