News April 27, 2024

AAP ఎమ్మెల్యేకు బెయిల్

image

ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ఆద్మీ MLA అమానతుల్లా ఖాన్‌కు బెయిల్ మంజూరైంది. రూ.15వేల పర్సనల్ బాండ్ చెల్లించి బెయిల్ పొందేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో నియామకాలు, బోర్డు ప్రాపర్టీల లీజు మంజూరుపై ఈడీ ఆయనను విచారిస్తోంది. ఈనెల 18న ఈడీ ఖాన్‌ను అరెస్ట్ చేసింది. కాగా ఈనెల తొలివారంలో లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన AAP ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు అయింది.

Similar News

News February 1, 2026

పోలవరం ఎత్తు తగ్గింపుతో తీరని నష్టం: బుగ్గన

image

AP: పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిస్తున్నట్లు కేంద్రం పదేపదే చెబుతున్నా రాష్ట్రం తలూపుతూ ఊరుకోవడం సరికాదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. దీనివల్ల భవిష్యత్తులో నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి ఎత్తు 45.72M అన్నారు. కాగా బడ్జెట్ నిరాశపర్చిందని YCP MP అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. పోలవరానికి ₹3వేల కోట్లే ఇచ్చారని, ఇలా అయితే అది ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు.

News February 1, 2026

బంగ్లాదేశ్‌కు ఇండియా ‘బడ్జెట్’ షాక్!

image

బడ్జెట్ 2026-27లో బంగ్లాదేశ్‌కు ఇండియా ఇచ్చే ఫండ్స్‌లో భారీగా కోత పెట్టింది. గతేడాది ₹120 కోట్లు కేటాయించగా ఈసారి దాన్ని సగానికి తగ్గించి ₹60 కోట్లు మాత్రమే ఇచ్చింది. బంగ్లాలో మైనారిటీలపై దాడులు పెరగడం, అక్కడి ప్రభుత్వం పాక్‌తో దోస్తీకి యత్నించడం వంటి కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్ ప్రాజెక్టుకు కూడా ఇండియా నిధులు కేటాయించలేదు.

News February 1, 2026

కరివేపాకు మొక్కలు గుబురుగా పెరగాలంటే?

image

కరివేపాకు మొక్కలు ఒక మీటరు ఎత్తు పెరిగాక మొక్క చివర్లను తుంచాలి. ఇలా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి మొక్కలు గుబురుగా పెరుగుతాయి. మూడేళ్లు వచ్చిన కరివేపాకు చిన్న కొమ్మలను మొక్క మొదలు వరకు తుంచి, 4 లేదా 5 శాఖలు ఉండేలా ఉంచితే ఎక్కువ దిగుబడి వచ్చి ఆదాయం పెరుగుతుంది. అలాగే పంట కోసిన తర్వాత ప్రతిసారీ 50 కిలోల నత్రజని, 50 కిలోల పొటాష్ అందించే ఎరువులను మొక్కలకు వేస్తూ ఉండాలి.