News April 27, 2024
AAP ఎమ్మెల్యేకు బెయిల్

ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ఆద్మీ MLA అమానతుల్లా ఖాన్కు బెయిల్ మంజూరైంది. రూ.15వేల పర్సనల్ బాండ్ చెల్లించి బెయిల్ పొందేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో నియామకాలు, బోర్డు ప్రాపర్టీల లీజు మంజూరుపై ఈడీ ఆయనను విచారిస్తోంది. ఈనెల 18న ఈడీ ఖాన్ను అరెస్ట్ చేసింది. కాగా ఈనెల తొలివారంలో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన AAP ఎంపీ సంజయ్ సింగ్కు బెయిల్ మంజూరు అయింది.
Similar News
News February 9, 2026
దీపాన్ని ఎలా వెలిగించాలంటే?

దీపారాధన చేసేటప్పుడు ముందుగా కుందుల్లో నూనె పోయాలి. ఆ తర్వాతే వత్తులు వేయాలి. వెండి, ఇత్తడి, మట్టి కుందులు వాడటం శ్రేష్ఠం. స్టీలు కుందులు అస్సలు వాడకూడదు. దీపపు కుందును నేరుగా నేలపై పెట్టడం మంచిది కాదు. పళ్లెం లేదా తమలపాకుపై ఉంచాలి. అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. ఏకహారతి లేదా అగరవత్తి సాయంతో వెలిగించాలి. దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుంది.
News February 9, 2026
నాలుగు రోజులు సెలవులు!

TG: ఈ వారంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు నాలుగు రోజులు హాలిడేస్ ఉండే అవకాశముంది. ఎల్లుండి(11) పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవులు ప్రకటించాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లెక్కింపు రోజైన 13న కూడా ఆయా స్కూళ్లు, కార్యాలయాలకు హాలిడేస్ ఉండనున్నాయి. మరుసటి రోజు రెండో శనివారం కాగా తదుపరి ఆదివారం కావడంతో వరుస సెలవులు రానున్నాయి. మరోవైపు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్ షాపులు <<19086702>>బంద్<<>> ఉండనున్నాయి.
News February 9, 2026
అమరావతిలో ఏఐ యూనివర్సిటీ!

AP: అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది. ఏఐ ఎకో సిస్టమ్, మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర ఐటీ శాఖ జీవో జారీ చేసింది. ఏఐ లివింగ్ ల్యాబ్స్ పేరుతో వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎన్విడియా కంపెనీ గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచే వర్సిటీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే దేశంలోనే తొలి ఏఐ వర్సిటీగా నిలవనుంది.


