News April 27, 2024
AAP ఎమ్మెల్యేకు బెయిల్

ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ఆద్మీ MLA అమానతుల్లా ఖాన్కు బెయిల్ మంజూరైంది. రూ.15వేల పర్సనల్ బాండ్ చెల్లించి బెయిల్ పొందేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో నియామకాలు, బోర్డు ప్రాపర్టీల లీజు మంజూరుపై ఈడీ ఆయనను విచారిస్తోంది. ఈనెల 18న ఈడీ ఖాన్ను అరెస్ట్ చేసింది. కాగా ఈనెల తొలివారంలో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన AAP ఎంపీ సంజయ్ సింగ్కు బెయిల్ మంజూరు అయింది.
Similar News
News February 16, 2026
₹1.28లక్షల కోట్ల బంగారం మాయం కాలేదు: FACT CHECK

ఆర్బీఐ ఖజానాలో ఉన్న 880.18టన్నుల బంగారం నుంచి రూ.1.28లక్షల కోట్ల విలువైన గోల్డ్ మాయమైందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని PIB ఫ్యాక్ట్చెక్ స్పష్టం చేసింది. బంగారం నిల్వల విలువ తగ్గినట్లు మాత్రమే RBI ప్రకటించిందని తెలిపింది. ఈ తగ్గుదల మార్కెట్ విలువలో మార్పుల వల్లేనని.. నిల్వల్లోని బంగారం ఎక్కడికీ పోలేదని వివరించింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించింది.
News February 16, 2026
మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ

తనకు షోల్డర్ కీహోల్ సర్జరీ జరిగినట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఇది చిన్న సర్జరీ అని, వేగంగా కోలుకుంటున్నానని ట్వీట్ చేశారు. రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. అల్లు శిరీష్ పెళ్లి ఆహ్వాన పత్రిక అందుకుంటున్న సమయంలో తీసిన ఫొటోల్లో చిరంజీవి చేతికి కట్టుతో కనిపించారు. దీంతో ఆయన చేతికి ఏం జరిగిందోనని సినీ వర్గాలు, అభిమానులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఆయన దీనిపై స్పష్టతనిచ్చారు.
News February 16, 2026
BRS సొంతం చేసుకున్న మున్సిపాలిటీలు (EC సైట్ ప్రకారం)

రాయికల్ (జగిత్యాల జిల్లా), ఆలంపూర్ (గద్వాల), అయిజ (గద్వాల), అమనగల్ (రంగారెడ్డి), అమరచింత (వనపర్తి), ఆసిఫాబాద్ (కొమురం భీం), తూప్రాన్ (మెదక్), మూడుచింతలపల్లి (మల్కాజ్గిరి), ఎల్లంపేట్ (మల్కాజ్గిరి), సిరిసిల్ల, గడ్డపోతారం (సంగారెడ్డి), గుమ్మడిదల (సంగారెడ్డి), ఇస్నాపూర్ (సంగారెడ్డి), జిన్నారం (సంగారెడ్డి), చేర్యాల (సిద్దిపేట), దుబ్బాక (సిద్దిపేట), గజ్వేల్ (సిద్దిపేట), తిరుమలగిరి (సూర్యాపేట).


