News April 27, 2024
AAP ఎమ్మెల్యేకు బెయిల్

ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ఆద్మీ MLA అమానతుల్లా ఖాన్కు బెయిల్ మంజూరైంది. రూ.15వేల పర్సనల్ బాండ్ చెల్లించి బెయిల్ పొందేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో నియామకాలు, బోర్డు ప్రాపర్టీల లీజు మంజూరుపై ఈడీ ఆయనను విచారిస్తోంది. ఈనెల 18న ఈడీ ఖాన్ను అరెస్ట్ చేసింది. కాగా ఈనెల తొలివారంలో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన AAP ఎంపీ సంజయ్ సింగ్కు బెయిల్ మంజూరు అయింది.
Similar News
News January 27, 2026
వర్క్ ఫ్రమ్ హోమ్పై ఇన్ఫోసిస్ కొత్త రూల్స్

‘వర్క్ ఫ్రమ్ హోమ్’ రూల్స్ను ఇన్ఫోసిస్ కఠినతరం చేసింది. ఎక్స్ట్రా WFH అనుమతులపై పరిమితి విధించింది. ప్రస్తుతం నెలకు 10 రోజులు ఆఫీసుకు రావాలనే నిబంధన ఉంది. దాన్నుంచి కూడా మినహాయింపు కోరే వెసులుబాటు కొనసాగుతోంది. ఇక నుంచి 3 నెలల్లో కేవలం 5 రోజులు మాత్రమే అలా మినహాయింపు ఇస్తారు. ఉద్యోగి లేదా ఫ్యామిలీలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం మెడికల్ సర్టిఫికెట్ చూపించి పర్మిషన్ తీసుకోవచ్చు.
News January 27, 2026
‘CM’ అంటే కోల్ మాఫియా: KTR

TG: ఆధారాలతో సహా సింగరేణి కుంభకోణాన్ని బట్టబయలు చేశామని KTR పేర్కొన్నారు. ‘గవర్నర్ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చాం. సింగరేణి కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి విచారణ పేరిట ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. ఇవాళ CM అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కోల్ మాఫియాకి నాయకుడిగా ప్రజలు, సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి ఉంది. టెండర్లకు సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే సమాధానం లేదు’ అని వ్యాఖ్యానించారు.
News January 27, 2026
పుస్తకాలే లోకమైన అక్షర తపస్వికి దక్కిన గౌరవం!

పుస్తకాలపై మక్కువతో తన ఆస్తినే అమ్ముకున్న కర్ణాటకలోని హరలహల్లికి చెందిన అంకే గౌడ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. బస్ కండక్టర్గా పనిచేస్తూనే 20 లక్షల పుస్తకాలతో అతిపెద్ద వ్యక్తిగత లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఇందులో 5 లక్షల విదేశీ పుస్తకాలు, 5 వేల నిఘంటువులు ఉన్నాయి. ఒక సామాన్యుడి పట్టుదల ఇప్పుడు దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని పొందేలా చేసింది. ఆయన కృషి నేటి తరానికి ఎంతో స్ఫూర్తి.


