News April 27, 2024

AAP ఎమ్మెల్యేకు బెయిల్

image

ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ఆద్మీ MLA అమానతుల్లా ఖాన్‌కు బెయిల్ మంజూరైంది. రూ.15వేల పర్సనల్ బాండ్ చెల్లించి బెయిల్ పొందేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో నియామకాలు, బోర్డు ప్రాపర్టీల లీజు మంజూరుపై ఈడీ ఆయనను విచారిస్తోంది. ఈనెల 18న ఈడీ ఖాన్‌ను అరెస్ట్ చేసింది. కాగా ఈనెల తొలివారంలో లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన AAP ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు అయింది.

Similar News

News February 1, 2026

బడ్జెట్ బూస్ట్.. ఎగసిన స్టాక్ మార్కెట్లు

image

ఉదయం ఫ్లాట్‌గా మొదలైన స్టాక్ మార్కెట్లు కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చాయి. కేంద్ర మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగం మొదలైన తర్వాత మెల్లగా పైకెగిశాయి. ప్రస్తుతం నిఫ్టీ 60 పాయింట్లు, సెన్సెక్స్ 250 పాయింట్లు లాభపడ్డాయి. నిఫ్టీ 25,370, సెన్సెక్స్ 82,521 వద్ద కొనసాగుతున్నాయి.

News February 1, 2026

Budget 2026-27: అరకులో మౌంటేన్ ట్రైన్స్

image

*ఏపీలోని అరకులో పర్యాటక రంగ అభివృద్ధి కోసం మౌంటేన్ ట్రైన్స్ ఏర్పాటు
*దేశంలో కొత్తగా 3 ఆయుర్వేద ఎయిమ్స్‌లు, 5 రీజినల్ మెడికల్ హబ్‌లు
*ఆయుష్ కేంద్రాలు, ల్యాబ్స్ అప్‌గ్రేడేషన్
*రూ.10వేల కోట్లతో MSMEల అభివృద్ధి
*కంటైనర్ తయారీ రంగం కోసం రూ.10వేల కోట్లు
*క్రీడల అభివృద్ధి కోసం ఖేలో ఇండియా మిషన్

News February 1, 2026

ఆ మూడు కర్తవ్యాలతోనే బడ్జెట్ రూపొందించాం: ఆర్థికమంత్రి

image

ఈసారి కేంద్ర బడ్జెట్‌ను మూడు కర్తవ్యాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గ్రోత్ పెంచడం, సమ్మిళిత అభివృద్ధి, తగిన సంస్కరణలతో ఆ వృద్ధిని కొనసాగించడం అనేవి మూడు కర్తవ్యాలని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యమని, దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు ఇవి సహాయపడతాయని తెలిపారు.