News April 27, 2024
AAP ఎమ్మెల్యేకు బెయిల్

ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ఆద్మీ MLA అమానతుల్లా ఖాన్కు బెయిల్ మంజూరైంది. రూ.15వేల పర్సనల్ బాండ్ చెల్లించి బెయిల్ పొందేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో నియామకాలు, బోర్డు ప్రాపర్టీల లీజు మంజూరుపై ఈడీ ఆయనను విచారిస్తోంది. ఈనెల 18న ఈడీ ఖాన్ను అరెస్ట్ చేసింది. కాగా ఈనెల తొలివారంలో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన AAP ఎంపీ సంజయ్ సింగ్కు బెయిల్ మంజూరు అయింది.
Similar News
News January 2, 2026
మున్సిపల్ ఎన్నికలు.. సీఎం జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ సర్కార్ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ నెలలోనే షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. వచ్చే నెల 3న జడ్చర్లలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. తర్వాత మిగతా జిల్లాల్లోనూ పర్యటించనున్నారు. పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది.
News January 2, 2026
రోడ్డుపై పొగమంచు.. ఈ జాగ్రత్తలు పాటించండి!

చలి తీవ్రత పెరగడంతో రహదారులపై పొగమంచు <<18738127>>దట్టంగా<<>> పేరుకుపోతోంది. దీనివల్ల ముందున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు వేగాన్ని తగ్గించి, ఫాగ్ లైట్లను, పార్కింగ్ లైట్స్ వాడాలని సూచిస్తున్నారు. ముందున్న వాహనానికి తగిన దూరం పాటించాలని, సింగిల్ వేలో ఓవర్టేక్ చేయవద్దని కోరుతున్నారు. మలుపుల వద్ద ఇండికేటర్లు వాడాలని చెబుతున్నారు. share it
News January 2, 2026
ఈ ఫ్రూట్స్తో క్యాన్సర్ దూరం

క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఆహారంలో కొన్నిమార్పులు చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మామిడి, నేరేడు, ఉసిరి, మారేడు, పనస, వాక్కాయలు వంటివి తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల తగ్గడంతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. వీటితో పాటు కోకుమ్, మంకీ జాక్ ఫ్రూట్ వంటివి తినడం కూడా మంచిదని సూచిస్తున్నారు.


