News April 27, 2024
AAP ఎమ్మెల్యేకు బెయిల్

ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ఆద్మీ MLA అమానతుల్లా ఖాన్కు బెయిల్ మంజూరైంది. రూ.15వేల పర్సనల్ బాండ్ చెల్లించి బెయిల్ పొందేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో నియామకాలు, బోర్డు ప్రాపర్టీల లీజు మంజూరుపై ఈడీ ఆయనను విచారిస్తోంది. ఈనెల 18న ఈడీ ఖాన్ను అరెస్ట్ చేసింది. కాగా ఈనెల తొలివారంలో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన AAP ఎంపీ సంజయ్ సింగ్కు బెయిల్ మంజూరు అయింది.
Similar News
News January 26, 2026
జుక్కల్లో చిరుత సంచారం.. 5 గ్రామాలకు హెచ్చరిక

జుక్కల్ మండలంలోని 5 గ్రామాల పరిధిలో చిరుత పులి సంచరిస్తుండటంతో అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు చిరుత అడుగుజాడలను గుర్తించారు. ముఖ్యంగా పొలాల వద్దకు, వ్యవసాయ బావుల దగ్గరకు వెళ్లే రైతులు, కూలీలు సమూహాలుగా వెళ్లాలని, అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
News January 26, 2026
జుక్కల్లో చిరుత సంచారం.. 5 గ్రామాలకు హెచ్చరిక

జుక్కల్ మండలంలోని 5 గ్రామాల పరిధిలో చిరుత పులి సంచరిస్తుండటంతో అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు చిరుత అడుగుజాడలను గుర్తించారు. ముఖ్యంగా పొలాల వద్దకు, వ్యవసాయ బావుల దగ్గరకు వెళ్లే రైతులు, కూలీలు సమూహాలుగా వెళ్లాలని, అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
News January 26, 2026
నేటి ముఖ్యాంశాలు

* 131 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
* అంతరిక్ష యాత్ర పూర్తిచేసిన శుభాంశు శుక్లాకు అశోక చక్ర
* అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
* TG: సింగరేణి టెండర్ల రద్దుపై విచారణకు సిద్ధం: కోమటిరెడ్డి
* నాంపల్లి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి.. రూ.5 లక్షల చొప్పున పరిహారం
* సింగరేణిలో మిగిలిన స్కామ్లను బయటపెడతాం: హరీశ్ రావు
* న్యూజిలాండ్పై మూడో T20Iలో భారత్ విజయం


