News April 27, 2024

AAP ఎమ్మెల్యేకు బెయిల్

image

ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ఆద్మీ MLA అమానతుల్లా ఖాన్‌కు బెయిల్ మంజూరైంది. రూ.15వేల పర్సనల్ బాండ్ చెల్లించి బెయిల్ పొందేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో నియామకాలు, బోర్డు ప్రాపర్టీల లీజు మంజూరుపై ఈడీ ఆయనను విచారిస్తోంది. ఈనెల 18న ఈడీ ఖాన్‌ను అరెస్ట్ చేసింది. కాగా ఈనెల తొలివారంలో లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన AAP ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు అయింది.

Similar News

News February 16, 2026

భద్రాద్రి: ఎకరాకు రూ.9,600 సబ్సిడీ

image

భద్రాద్రి జిల్లాలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవనశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ అధికారి జంగా కిషోర్ సోమవారం తెలిపారు. కూరగాయలు సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.9,600 సబ్సిడీ అందించనున్నట్లు తెలిపారు. దీంతో రైతుల ఆదాయం పెంపొందించడం, పంటల వైవేదికరణ, పోషకాహాభద్రత పెరుగుతుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 16, 2026

వరి సన్నాలు పండించిన రైతులకు బోనస్ డబ్బు విడుదల

image

TG: రాష్ట్రంలో వరి సన్నాలను పండించి, విక్రయించిన రైతులకు ప్రభుత్వం బోనస్ డబ్బును విడుదల చేసింది. వానాకాలం సీజన్‌లో సన్నాలు అమ్మిన 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో బోనస్ కింద రూ.514.36 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అదనంగా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్న బియ్యం వరి రకాలను సాగు చేసిన రైతులకు క్వింటాకు అదనంగా రూ.500 చొప్పున బోనస్ జమకానుంది.

News February 16, 2026

డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో ఉద్యోగాలు

image

న్యూఢిల్లీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 10 సైంటిస్ట్ C పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. PhD(లైఫ్ సైన్స్/ బయో టెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్/అగ్రికల్చరల్/ వెటర్నరీ సైన్సెస్), MD అర్హత గల వారు మార్చి 14వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.67,700-రూ.2,08700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.dbtindia.gov.in