News April 27, 2024

AAP ఎమ్మెల్యేకు బెయిల్

image

ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ఆద్మీ MLA అమానతుల్లా ఖాన్‌కు బెయిల్ మంజూరైంది. రూ.15వేల పర్సనల్ బాండ్ చెల్లించి బెయిల్ పొందేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో నియామకాలు, బోర్డు ప్రాపర్టీల లీజు మంజూరుపై ఈడీ ఆయనను విచారిస్తోంది. ఈనెల 18న ఈడీ ఖాన్‌ను అరెస్ట్ చేసింది. కాగా ఈనెల తొలివారంలో లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన AAP ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు అయింది.

Similar News

News February 5, 2026

వ్యవసాయ రంగం అంటే చంద్రబాబుకు చిన్నచూపు: సజ్జల

image

AP: వ్యవసాయ రంగంపై చంద్రబాబుకు చిన్నచూపు ఉందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం రాయలసీమకే కాకుండా రాష్ట్రానికే ఘోర అన్యాయమన్నారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పథకాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. YCP నిర్వహించిన ఛలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో సజ్జలతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.

News February 5, 2026

హనీమూన్ మర్డర్ 2.0.. ప్రియుడితో కలిసి భర్త హత్య

image

మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ తరహాలో రాజస్థాన్‌లోనూ ఓ హత్య జరిగింది. గంగానగర్ పోలీసుల కథనం ప్రకారం.. JAN 30న ఓ కపుల్‌ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. భర్త ఆశిష్ స్పాట్‌లో చనిపోయారు. భార్య అంజు వద్ద దుండగులు నగలు దోచుకున్నారు. అయితే అతడిని కొట్టి గొంతునులిమి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. పోలీసుల దర్యాప్తులో భార్యే Ex.లవర్‌‌తో కలిసి భర్తను చంపి.. ప్రమాదంగా మలిచినట్లు తేల్చారు.

News February 5, 2026

పాపాలు, వ్యాధులను మాయం చేసే ఆలయం

image

MHలోని నాసిక్ జిల్లాలో 7 పర్వతాల నడుమ వెలసిన క్షేత్రం సప్తశృంగి ఆలయం. సతీదేవి కుడి చేయి పడిన ఈ ప్రదేశం 52 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారు 10 అడుగుల ఎత్తులో, 18 చేతులతో ‘మహిషాసుర మర్దిని’గా దర్శనమిస్తారు. రాముడు, హనుమంతుడు సందర్శించిన ఈ ప్రాంతంలోని పవిత్ర తీర్థాలలో స్నానం చేస్తే పాపాలు, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని నమ్మకం. ప్రకృతి సౌందర్యం మధ్య కొలువైన అమ్మవారి దర్శనం ధైర్యన్నిస్తుంది.