News August 7, 2025
బాలకృష్ణ ఏడాదికి 4 చిత్రాలు చేస్తానన్నారు: నిర్మాత

హీరో బాలయ్య ఏడాదికి 4 సినిమాల్లో నటిస్తానని చెప్పినట్లు నిర్మాత ప్రసన్నకుమార్ వెల్లడించారు. సినీ కార్మికుల వేతనాల పంచాయితీపై కొందరు నిర్మాతలు బాలకృష్ణను కలిసిన విషయం తెలిసిందే. ‘నిర్మాతలు, కార్మికులు ఇద్దరూ బాగుండేలా చూసుకుంటానని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. వర్కింగ్ డేస్ తక్కువుంటే మంచిదన్నారు. అవసరం మేరకే కార్మికులను తీసుకోవాలని సూచించారు’ అని నిర్మాత తెలిపారు.
Similar News
News August 7, 2025
EP29: ఈ అలవాట్లు ఉంటే జీవితం నాశనం: చాణక్య నీతి

కొన్ని అలవాట్లు యువతీ యువకుల జీవితాలను నాశనం చేస్తాయని చాణక్య నీతి చెబుతోంది. ‘యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. అవి మనుషుల్ని శారీరకంగా, మానసికంగా బలహీనపరుస్తాయి. ఆర్థికంగానూ దెబ్బతినే అవకాశం ఉంటుంది. యువత సోమరితనంగా ఉండొద్దు. అలా ఉంటే జీవిత లక్ష్యాన్ని చేరుకోలేరు. అందుకే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలి. చెడు అలవాట్లు ఉన్నవారితో స్నేహం చేయొద్దు’ అని బోధిస్తోంది.
News August 7, 2025
US టారిఫ్స్.. ఈ రంగాలకు భారీ నష్టం!

US 50% <<17324027>>టారిఫ్స్<<>> విధించడంతో ఆ దేశంలో భారతీయ వస్తువుల ధరలు పెరగనున్నాయి. వస్త్రాలు, చెప్పులు, లెదర్, కెమికల్స్, జువెల్లరీ, సీ ఫుడ్ తదితర రంగాలు భారీగా నష్టపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఎగుమతులు 40-50% తగ్గొచ్చని అంటున్నారు. కాగా ట్రంప్ జులై 31న ప్రకటించిన మొదటి రౌండ్ సుంకాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. నిన్న విధించిన అదనపు 25% టారిఫ్స్ ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తాయి.
News August 7, 2025
75% హాజరు తప్పనిసరి: CBSE

బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరి అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్పష్టం చేసింది. అటెండెన్స్ రికార్డులు సరిగా లేకపోయినా, విద్యార్థులు క్రమం తప్పకుండా స్కూలుకు రావట్లేదని తేలినా పాఠశాలలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితులు, మెడికల్ ఎమర్జెన్సీ, జాతీయ/అంతర్జాతీయ స్పోర్ట్ ఈవెంట్స్ వంటి కారణాలతో హాజరు కాని వారికి 25% సడలింపు ఉండనుంది.