News September 14, 2024
మణిపుర్లో ఇంటర్నెట్పై నిషేధం ఎత్తివేత

మణిపుర్లోని 5 జిల్లాల్లో ఇంటర్నెట్పై నిషేధాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఇంటర్నెట్ కనెక్షన్ IPతోనే సేవలు పొందవచ్చని, రూటర్స్ వైఫై/హాట్స్పాట్ ద్వారా అనుమతి ఉండదని చెప్పింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. మిలిటెంట్ల దాడులను నిరసిస్తూ SEP 10న విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఘర్షణ వాతావరణం ఏర్పడి 80 మంది గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం ఇంటర్నెట్పై నిషేధం విధించింది.
Similar News
News November 25, 2025
మహిళలపై హింసకు అడ్డుకట్ట వేద్దాం

మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తూ ఆకాశానికెగసినా ఇంట్లో జరిగే హింసను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఈ విషయంపై ఆడవాళ్లకు సరైన అవగాహన కల్పించాలనీ, వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఐరాస ఏటా నవంబర్ 25న ‘మహిళలపై హింస నిర్మూలనా దినోత్సవాన్ని’ నిర్వహిస్తోంది. భారత్లో దాదాపు 30శాతం మహిళలు సన్నిహిత భాగస్వామి నుంచే హింసను ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడిస్తోంది.
News November 25, 2025
హింసకు వ్యతిరేకంగా ప్రభుత్వాల చేయూత

గృహహింసకి సంబంధించి జాతీయ మహిళా కమిషన్ వాట్సప్ నెంబర్: 72177-35372తో పాటు ఆ సంస్థ వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేయొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బాధితులు 181, 1091, 100 నంబర్లకు ఫోన్ చేస్తే తక్షణం పోలీస్ సాయం అందుతుంది. స్త్రీ, శిశు సంక్షేమ కార్యాలయాల్లోనూ ఫిర్యాదు చేసే వ్యవస్థలు ఉన్నాయి. వీటితో పాటు ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసి, రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
News November 25, 2025
సాయంత్రం టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్

మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇవాళ విడుదల కానుంది. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచులు, వేదికల వివరాలను రోహిత్, సూర్య, మాథ్యూస్, హర్మన్తో ICC రివీల్ చేయించనుంది. IND, శ్రీలంక సంయుక్తంగా హోస్ట్ చేయనున్న ఈ టోర్నీలో 20జట్లు పాల్గొంటాయి. PAK మ్యాచులన్నీ లంకలో జరుగుతాయి. IND డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. గతేడాది జరిగిన ఫైనల్లో RSAపై 7 రన్స్ తేడాతో గెలిచి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే.


