News December 5, 2024
యూకేలో జంక్ ఫుడ్ యాడ్స్పై నిషేధం!

బాల్యంలోనే అధికమవుతున్న స్థూలకాయం సమస్యల్ని కట్టడి చేయడానికి UK ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పగటిపూట జంక్ ఫుడ్పై TVల్లో వచ్చే ప్రకటనలపై నిషేధం విధించింది. గ్రానోలా, మఫిన్లు, పేస్ట్రీ ప్రకటనలపై ఈ నిషేధం కొనసాగుతుంది. 2025 Oct నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలతో ‘జంక్ ప్రకటనల్ని’ రాత్రి 9 తర్వాతే ప్రసారం చేయాలి. మన దేశంలో కూడా ఇలాంటి నిషేధం అమలు చేయాలా?
Similar News
News March 24, 2026
అమెరికాలో 40 శాతం పెరిగిన డీజిల్ ధరలు

ఇరాన్పై యుద్ధంతో అమెరికా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే ఆ దేశానికి ₹లక్షల కోట్లు ఖర్చవుతోంది. మరోవైపు డీజిల్ ధరలు 40 శాతం మేర పెరిగాయి. గ్యాలన్ ధర $5.29కు(ఒక గ్యాలన్=3.78 లీటర్లు) చేరుకుంది. 2022 తర్వాత ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీంతో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ నుంచి రోజుకు 10-15 లక్షల బ్యారెళ్లను విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది క్రమంగా 30 లక్షలకు చేరుకోవచ్చన్నారు.
News March 24, 2026
ధురంధర్-2 ధమాకా.. ₹800కోట్లు దాటిన గ్లోబల్ కలెక్షన్లు

బాక్సాఫీసుపై ధురంధర్-2 దండయాత్ర కొనసాగుతోంది. ఈ మూవీ హిందీ వెర్షన్ నాలుగు రోజుల్లో ₹430కోట్ల నెట్ వసూలు చేసి పుష్ప-2 హిందీ వెర్షన్ (₹425.10కోట్లు) రికార్డ్ బ్రేక్ చేసింది. ఐదురోజుల్లో దేశంలో ఈ మూవీ గ్రాస్ ₹619.76కోట్లు ఉండగా గ్లోబల్ కలెక్షన్లలో గ్రాస్ ₹829.76కోట్లకు చేరినట్లు Sacnilk తెలిపింది. ఇదే జోరు కొనసాగితే మరో రెండు రోజుల్లో ధురంధర్-2 ₹1000కోట్ల మార్క్ చేరే అవకాశం ఉందని సినీ వర్గాల అంచనా.
News March 24, 2026
రూ.10వేలు తగ్గిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర క్రమంగా తగ్గుతోంది. ఇవాళ కేజీ సిల్వర్ రేటు రూ.10,000 పతనమై రూ.2,40,000కు చేరింది. శుభకార్యాల వేళ వారం రోజుల్లోనే కేజీ సిల్వర్ రేటు రూ.40,000 తగ్గి కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది. అయితే పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో పతనమవుతున్న ఈ ధరలు ఇన్వెస్టర్లకు నష్టాలనిస్తున్నాయి.


