News October 23, 2024

రాష్ట్రంలో మెయనైస్‌పై నిషేధం?

image

TG: షావర్మా, ఫ్రైడ్ చికెన్, పిజ్జాపై మెయనైస్ వేసుకుని తింటే ఆ రుచే వేరు. అయితే పచ్చిగుడ్డుతో తయారుచేసే మెయనైస్ వల్ల ఈ ఏడాది HYDలో 10 ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైనట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తెల్లగా, క్రీమ్‌లాగా ఉండే మెయనైస్‌లో హానికర సూక్ష్మక్రిములు ఉంటాయని, దాన్ని బ్యాన్ చేయాలని కోరారు. కాగా ఇప్పటికే మెయనైస్‌పై కేరళ సర్కారు నిషేధం విధించింది.

Similar News

News March 17, 2025

డీఎంకే లక్ష్యంగా బీజేపీ ఆందోళనలు

image

తమిళనాడులో డీఎంకే సర్కార్ టార్గెట్‌గా బీజేపీ ఆందోళనలకు దిగింది. మద్యం దుకాణాల ముట్టడికి బీజేపీ పిలుపునివ్వగా పార్టీ చీఫ్ అన్నామలై సహా కీలక నేతలు హౌస్ అరెస్టయ్యారు. లిక్కర్ అమ్మకాల ద్వారా డీఎంకేకు రూ.1000 కోట్లు ముట్టాయని బీజేపీ ఆరోపణలకు పాల్పడుతోంది. రూపీ(₹) సింబల్ పేరుతో డీఎంకే నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

News March 17, 2025

RECORD: FY25లో ₹1.75 లక్షల కోట్ల ఫోన్లు ఎగుమతి

image

భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. FY25 తొలి 11 నెలల్లోనే రూ.1.75లక్షల కోట్ల ($21B) విలువైన మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసింది. IT మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ అంచనా వేసిన $20Bతో పోలిస్తే ఇది ఎక్కువే. FY24లో ఎగుమతి చేసిన $15.6Bతో చూస్తే ఏకంగా 54% ఎక్కువ. భారత్ నుంచి అమెరికా, బ్రిటన్, UAE, నెదర్లాండ్స్‌కు యాపిల్, శామ్‌సంగ్ మొబైళ్లు ఎగుమతి అవుతున్నాయి. అందులో USకే 50% కన్నా ఎక్కువ వెళ్తున్నాయి.

News March 17, 2025

ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లోనే రూ.24 కోట్లు

image

హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.24.4 కోట్లు వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ తీర్పు ఇచ్చారని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ఈ మూవీ యూఎస్ఏలో 600K డాలర్లు రాబట్టిందని సినీ వర్గాలు తెలిపాయి.

error: Content is protected !!