News March 10, 2025
IPLలో ఆ యాడ్స్ బ్యాన్ చేయండి: కేంద్రం

మరికొన్ని రోజుల్లో IPL టోర్నీ ప్రారంభం కానుండగా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిషేధించిన వాటితో పాటు పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కోరుతూ BCCIతో పాటు IPL ఛైర్మన్కు లేఖ రాసింది. అలాగే, క్రీడాకారులు, కామెంటేటర్స్ కూడా ప్రమోట్ చేయొద్దని ఆరోగ్య శాఖ డైరెక్టర్ లేఖలో పేర్కొన్నారు. IPLను యూత్ ఎక్కువగా చూస్తుండటంతో పొగాకు, మద్యం యాడ్స్ వీరిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Similar News
News March 10, 2025
పుష్ప-2 లాభాలను దానికోసం వాడేలా చూడండి: హైకోర్టులో పిల్

TG: పుష్ప-2 సినిమాకు వచ్చిన లాభాలను చిన్న బడ్జెట్ సినిమాల రాయితీకి ఉపయోగించాలని నరసింహారావు అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం లాభాలను కళాకారుల సంక్షేమానికి వాడాలని అందులో కోరారు. కేసులో తదుపరి విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది. గత ఏడాది డిసెంబరులో విడుదలైన పుష్ప-2 అన్ని భాషల్లో కలిసి రూ.1800 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది.
News March 10, 2025
షుగర్ బాధితులకు GOOD NEWS

డయాబెటిస్ రోగులకు అవసరమైన ఔషధాల భారం తగ్గనుంది. దేశీయ ఫార్మా కంపెనీలు త్వరలో Empagliflozin జనరిక్ వెర్షన్ ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. మార్చి 11 నుంచి ఈ డ్రగ్పై పేటెంటు ముగుస్తుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం రూ.60గా ఉన్న ట్యాబ్లెట్ జనరిక్లో రూ.9-14కే అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం ప్రస్తుతం దేశంలో 10.1 కోట్ల మంది షుగర్ పేషంట్లు ఉన్నారు.
News March 10, 2025
అమరావతిలో 13 సంస్థల భూ కేటాయింపులు రద్దు

ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో 13 సంస్థలకు భూ కేటాయింపులను రద్దు చేసింది. మరో 31 సంస్థలకు భూ కేటాయింపులను కొనసాగించాలని నిర్ణయించింది. 16 సంస్థల భూములకు లొకేషన్, ఎక్స్టెన్షన్ మార్పులు చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం కక్షసాధింపుతో రాజధానిపై మూడు ముక్కలాట ఆడిందని ఆయన ఆరోపించారు.