News November 15, 2024

మహిళా మంత్రిని భయపెడుతున్న అరటిపండ్లు!

image

స్విడన్‌లో జెండర్ ఈక్వాలిటీ మినిస్టర్ పౌలినా బ్రాండ్‌బర్గ్‌ అరటి పండ్లను చూస్తే ఆమడదూరం పరిగెత్తుతున్నారు. ఆమెకు బనాన ఫోబియా ఉంది. అందుకే తాను ఎక్కడ పర్యటనకు వెళ్లినా ముందే అక్కడి అధికారులతో ‘బనానా ఫ్రీ’ జోన్‌లను ఏర్పాటు చేయమని మెయిల్స్ చేస్తున్నారు. ఫోబియా నుంచి బయటపడేందుకు ఆమె చికిత్స పొందుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఈ ఫోబియా ఉన్నవారికి అరటి పండ్లను చూస్తే వికారం, ఆందోళన కలుగుతుంది.

Similar News

News October 28, 2025

కనీస మద్దతు ధర ₹8110తో పత్తి కొనుగోలు: అచ్చెన్నాయుడు

image

AP: రాష్ట్రంలో CCI ద్వారా 33 పత్తికొనుగోలు కేంద్రాలను రేపట్నుంచి ఆరంభించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. వీటి ద్వారా వెంటనే పత్తి సేకరణ చేపట్టాలన్నారు. 2025-26లో 4.56లక్షల హెక్టర్లలో పత్తిసాగు చేశారని, 8లక్షల టన్నుల దిగుబడి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. క్వింటాలు పత్తికి నిర్ణయించిన మద్దతు ధర ₹8110ను రైతులకు అందించాలన్నారు. రైతులు కూడా పత్తి అమ్మకాలకు నిబంధనలు పాటించాలని సూచించారు.

News October 28, 2025

సేంద్రియ మల్చింగ్ ఎలా వేస్తారు? లాభమేంటి?

image

ఎండు గడ్డి, ఎండిన ఆకులు, వరిపొట్టు, రంపం పొట్టులను మొక్క చుట్టూ 2 నుంచి 5 అంగుళాల మందంలో వేసి కప్పడాన్ని సేంద్రియ మల్చింగ్ అంటారు. ఇవి పంటకు మల్చింగ్‌గా, సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి. దీని వల్ల నేల తేమను నిలుపుకుంటుంది. నేలకోత, నేల ఉష్ణోగ్రత తీవ్రత తగ్గుతుంది. కలుపు సమస్య తగ్గి.. పంటకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. చలి నుంచి మొక్క వేర్లను, నేల భౌతిక లక్షణాలను ఇది సంరక్షిస్తుంది.

News October 28, 2025

సేంద్రియ మల్చింగ్ – ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

image

సేంద్రియ మల్చింగ్ మొక్క మొదళ్లకు మరీ దగ్గరగా కాకుండా కాస్త దూరంగా వేస్తే మొక్క కాండానికి హాని కలగదు. ఈ మల్చింగ్ ఎక్కువ దళసరిగా వేస్తే మొక్కకు నీరు, గాలి లభ్యత తగ్గిపోతుంది. ఇవి ఎక్కువ తడిస్తే చిన్న చిన్న క్రిములు, శిలీంధ్రాలు రావచ్చు. కాబట్టి, సేంద్రియ మల్చులను ఎండేలాగా తిప్పి గాలి అందే విధంగా చూసుకోవాలి. శీతాకాలం ముందు మల్చులు వేసుకుంటే మొక్క వేర్లకు, నేలకు చలి వల్ల కలిగే నష్టం తగ్గించుకోవచ్చు.