News April 24, 2024
లేని గాయానికి వేసిన కట్టు సైజు రోజురోజుకీ పెరుగుతోంది: లోకేశ్

AP: సీఎం జగన్పై టీడీపీ నేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ‘ఆ రాయి కోడికత్తి చరిత్రను తిరగరాసింది. చీకట్లో లక్ష్యం తప్పకుండా ప్యాలస్ రాయి రెండు పిట్టలను కొట్టేసింది. లేని గాయానికి వేసిన కట్టు సైజు రోజురోజుకీ పెరుగుతోంది. ఈ”కట్టు”కథలు మే 13న కంచికి చేరుతాయి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 17, 2025
సంతబొమ్మాళి: మృత్యువులోనూ వీడని చిన్నారుల స్నేహం

సంతబొమ్మాళి(M) నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువులోనూ స్నేహం విడలేదు. సుధీర్ (8), అవినాష్ (8) నీటికుంటలో ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకు వెళ్లినా ఇద్దరు కలిసే వెళతారు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలను పెంచుతున్నారు.
News November 17, 2025
నాకు రాముడు అంటే ఎప్పుడూ ఇష్టం లేదు.. రాజమౌళి పాత ట్వీట్ వైరల్

తనకు దేవుడంటే నమ్మకం లేదంటూ <<18300800>>రాజమౌళి<<>> చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్న వేళ ఆయన పాత ట్వీట్ వైరల్ అవుతోంది. 2011లో ఓ అభిమాని జక్కన్నకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పారు. ‘థాంక్యూ. కానీ నాకు రాముడు అంటే ఎప్పుడూ ఇష్టం లేదు. అన్ని అవతారాల్లో కృష్ణుడు నా ఫేవరెట్’ అని రిప్లై ఇచ్చారు. మరి రాముడి పేరుతో సినిమాలు తీసి డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నారు? అని నెటిజన్లు ఫైరవుతున్నారు.
News November 17, 2025
నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.


