News June 16, 2024
మెదక్ ఘటనపై పోలీసులకు బండి సంజయ్ ఫోన్

TG: మెదక్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. నిందితులపై కఠినంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అమాయకులపై కేసులు పెట్టొద్దంటూ బండి హెచ్చరించినట్లు సమాచారం. మెదక్లో గోవధకు ప్రయత్నం జరుగుతోందన్న ప్రచారంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే.
Similar News
News March 27, 2026
వీటి శుభ్రత విషయంలో నిర్లక్ష్యం వద్దు

మేకప్ బ్రష్లు, స్పాంజ్లకు ఎక్స్పైరీ డేట్ ఉండదు. కానీ వాటిని ఏడాదికి ఒకసారైనా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. మేకప్ టూల్స్ను దీర్ఘకాలంపాటు మార్చకుండా ఉంటే వాటి నాణ్యతపై ప్రభావం పడుతుంది. అలాగే వీటిని రెగ్యులర్గా క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగి మొటిమలు, ఇతర చర్మ సమస్యలు తలెత్తుతాయి. వేడి నీళ్లు, డిష్ వాషర్ సోప్, యాంటి బ్యాక్టీరియల్ సోప్, బేబీషాంపూతో వాటిని శుభ్రం చేసుకోవచ్చు.
News March 27, 2026
జీడిమామిడి పిక్కలకు అధిక ధర రావాలంటే..

చాలా మంది రైతులు జీడిమామిడి కాయలను పూర్తిగా పండకుండానే చెట్ల నుంచి తీసేస్తున్నారు. దీని వల్ల పిక్కల లోపల పప్పు పూర్తిగా తయారవ్వడంలేదు. ఫలితంగా మార్కెట్లో ఆశించిన ధర దక్కడం లేదు. అందుకే తోటల్లో పండు, పిక్కతో సహా కింద పడిన కాయలను మాత్రమే ఏరుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండ్ల నుంచి పిక్కలను వేరు చేసి.. వాటిని 3 రోజుల పాటు ఎండలో ఆరబెడితే గింజలు మంచి బరువు ఉండి, అధిక ధర లభిస్తుంది.
News March 27, 2026
వెండి తెర ‘శ్రీరాములు’

ఆదర్శ పురుషుడైన శ్రీరాముడి పాత్రను వెండి తెరపై పోషించి పలువురు మెప్పించారు. 1932లో ‘పాదుకా పట్టాభిషేకం’ సినిమాలో తొలిసారి యడవల్లి సూర్యనారాయణ రాముడిగా కనిపించారు. అనేక చిత్రాల్లో NTR రఘురాముడిగా జీవించారు. వీరే కాకుండా CSR ఆంజనేయులు, ANR, హరనాథ్, శోభన్బాబు, కాంతారావు, జూ.NTR, సుమన్, శ్రీకాంత్, బాలకృష్ణ, ప్రభాస్ రామయ్య పాత్రలో మెరిశారు. మహేశ్ బాబు, రణ్బీర్ కూడా రాముడిగా నటిస్తున్నారు.


