News March 7, 2025

బెంగళూరు యూనివర్సిటీకి మన్మోహన్ పేరు

image

బెంగళూరు యూనివర్సిటికీ మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ పేరు పెట్టనున్నట్లు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. దివంగత నేత పేరును విశ్వవిద్యాలయానికి పెట్టడం దేశంలోనే తొలిసారన్నారు. మాజీ ప్రధాని సంస్కరణల వల్ల జరిగిన అభివృద్ధి భావితరాలకు తెలిసేలా రీసెర్చ్‌, స్టడీసెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు Dy Cm డీకే శివకుమార్ తెలిపారు. 1991లో సింగ్ తెచ్చిన సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టాయి.

Similar News

News December 23, 2025

ధనుర్మాసం: ఎనిమిదో రోజు కీర్తన

image

‘తూర్పున తెలవారింది. గేదెలు మేతకు వెళ్లాయి. కృష్ణుడిని చేరుకోవాలని గోపికలంతా ఓచోట చేరి, నిద్రపోతున్న నిన్ను మేల్కొల్పుతున్నారు. కేశి అనే అసురుణ్ణి, చాణూర ముష్టికులను అంతం చేసిన వీరుడి సన్నిధికి అందరం కలిసి వెళ్దాం పద! మనకంటే ముందే ఆయన వస్తే బాగుండదు. మనమే ముందెళ్లి ఎదురుచూస్తే ఆయన సంతోషంతో మన కోరికలను వెంటనే నెరవేరుస్తారు. ఆలస్యం చేయక లే, కృష్ణ పరమాత్మను కొలిచి నోము ఫలాన్ని పొందుదాం’.<<-se>>#DHANURMASAM<<>>

News December 23, 2025

30 దేశాల్లో అమెరికా రాయబారుల తొలగింపు

image

30 దేశాల్లోని తమ రాయబారులను తొలగిస్తూ US అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. వీరంతా బైడెన్‌ హయాంలో నియమించిన వారు కావడం విశేషం. అధ్యక్షుడు ట్రంప్ ఎజెండా(అమెరికా ఫస్ట్)కు అనుగుణంగా పని చేసే ఉద్దేశంతో వీరి స్థానంలో కొత్తవారిని నియమించనున్నట్లు అధికారులు తెలిపారు. తొలగించినవారిలో నేపాల్, శ్రీలంక, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్ తదితర దేశాల రాయబారులున్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో పలు ఒప్పందాలు మారనున్నాయి.

News December 23, 2025

వారు ఆ టైంలోనే తిరుమలకు రావాలి: BR నాయుడు

image

AP: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తామని TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. ‘DEC 30 నుంచి JAN 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నాం. 10 రోజులలో మొత్తం 182గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్యులకే కేటాయించాం. ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన వారు తప్పనిసరిగా నిర్దేశిత తేదీ, టైంలోనే తిరుమలకు చేరుకోవాలి. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు తదితర ఏర్పాట్లు చేశాం’ అని తెలిపారు.