News July 22, 2024
సుప్రీం తీర్పుతో శాంతించిన బంగ్లాదేశ్

పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971 నాటి యుద్ధంలో పాల్గొన్న వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను ఆ దేశ సుప్రీం కోర్టు రద్దు చేసింది. వాటిని మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని ఆదేశించింది. దీంతో కొంతకాలంగా ఆ దేశంలో నెలకొన్న హింసాత్మక ఘటనలకు ఫుల్స్టాప్ పడింది. కాగా ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పౌరులు చేపట్టిన ఆందోళనల్లో ఇప్పటి వరకు 115 మంది మరణించినట్లు తెలుస్తోంది.
Similar News
News November 8, 2025
CSIR-IIIMలో ఉద్యోగాలు

CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(<
News November 8, 2025
కోళ్ల దాణా నిల్వ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.
News November 8, 2025
భారత్, ఆస్ట్రేలియా మ్యాచుకు అంతరాయం

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఐదో టీ20 నిలిచిపోయింది. బ్యాడ్ వెదర్, వర్షం వచ్చే అవకాశం ఉండటంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 4.5 ఓవర్లలో 52-0గా ఉంది. అభిషేక్ 23, గిల్ 29 రన్స్ చేశారు.


