News October 27, 2025
మరోసారి భారత్ను రెచ్చగొట్టిన బంగ్లా చీఫ్

బంగ్లా చీఫ్ యూనస్ మరోసారి భారత్ను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. పాక్ ఆర్మీ జనరల్కు ఆయన ప్రజెంట్ చేసిన బుక్ దుమారం రేపింది. ఆ బుక్ కవర్ పేజీపై అస్సాం సహా ఇతర నార్త్ఈస్ట్ రాష్ట్రాలను బంగ్లాలో భాగంగా చూపారు. ర్యాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్స్ డిమాండ్ చేస్తున్న ‘గ్రేటర్ బంగ్లాదేశ్’కు యూనస్ మద్దతిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కొంతకాలంగా ఆయన నార్త్ఈస్ట్ స్టేట్స్పై అభ్యంతరకర కామెంట్స్ చేయడం తెలిసిందే.
Similar News
News October 27, 2025
ఉపవాసాల వెనుక ఉద్దేశ్యం ఇదే..

ధార్మిక ఆచరణలు ప్రారంభించే ముందు శరీరాన్ని, మనస్సును పవిత్రం చేసుకోవాలి. అందులో భాగంగానే ఉపవాసం ఉంటారు. భౌతిక సుఖాలను తాత్కాలికంగా త్యజించడం దీని పరమార్థం. అయితే ఉపవాసమంటే ఆహారం పూర్తిగా మానడం కాదు. ఇది దయ, ఓర్పు, శాంతి వంటి మంచి లక్షణాలను పెంపొందిస్తుంది. కోరికలు, లోభం వంటి చెడు గుణాలను దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక గుణాలు లేకుండా, ఉపవాసం పాటిస్తూ కడుపు మాడ్చుకుంటే ఎలాంటి ఫలితం లభించదు. <<-se>>#Aushadam<<>>
News October 27, 2025
పత్తి తేమ 12% దాటితే మద్దతు ధర రాకపోవచ్చు: తుమ్మల

TG: పత్తి అమ్మకాల విషయంలో రైతులు నాణ్యత, తేమ శాతాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తి తేమ 12% మించకుండా చూసుకోవాలన్నారు. 12శాతం మించితే కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉండదని తెలిపారు. గరిష్ఠ మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ విషయమై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
News October 27, 2025
భారత్తో టెస్ట్ సిరీస్.. SA జట్టు ప్రకటన

వచ్చే నెలలో భారత్తో జరగనున్న రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్కు 15 మంది కూడిన జట్టును SA ప్రకటించింది. కెప్టెన్గా టెంబా బవుమా వ్యవహరించనున్నారు. మార్క్రమ్, బాష్, బ్రెవిస్, టోనీ, రికెల్టన్, స్టబ్స్, వెరైన్, హమ్జా, హార్మర్, కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి, ముల్డర్, జాన్సన్, రబాడ ఎంపికయ్యారు. నవంబర్ 14న తొలి టెస్టు కోల్కతాలో, రెండోది 22న గువాహటిలో జరుగుతాయి.


