News March 27, 2025
బంగ్లా ఫ్రీడమ్ డే.. యూనస్కు మోదీ లేఖ

బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్కు ప్రధాని మోదీ లేఖ రాశారు. 1971 యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు పునాది పడిన రోజుగా అభివర్ణించారు. ఇకపైనా ‘సున్నితమైన’ అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా యూనస్తో పాటు బంగ్లా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
Similar News
News October 24, 2025
మల్లె సాగు – అనువైన రకాలు

మల్లె సాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. తేలికపాటి నేలలు, ఒండ్రునేలలు, ఇసుక నేలల్లో దిగుబడి బాగుంటుంది. గుండు మల్లె, జాజిమల్లె, కాగడా మల్లె రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. గుండు మల్లెల్లో అర్క ఆరాధన, కో-2, కస్తూరి రకాలు.. జాజిమల్లెల్లో అర్క సురభి, కో-1, కో-2 రకాలు మంచి దిగుబడినిస్తాయి. పూల కోసం, నూనె తయారీకి జాజిమల్లెలు అనుకూలం. కాగడ మల్లెలు నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకుంటాయి.
News October 24, 2025
APPLY NOW: సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్లో 145 పోస్టులు

కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్ 145 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ICAI/ICOAI/ICSIలో ఇంటర్మీడియట్/ ఎగ్జిక్యూటివ్ లెవల్లో ఉత్తీర్ణులైన CA/CS/CMS అభ్యర్థులు అర్హులు. వెబ్సైట్: https://www.mca.gov.in/ లేదా https://icsi.edu/
News October 24, 2025
అఫ్గాన్ బార్డర్లు క్లోజ్.. పాక్లో కేజీ టమాటా రూ.600

ఉద్రిక్తతల నేపథ్యంలో అఫ్గాన్-పాక్ బార్డర్లు ఇటీవల మూసేసిన విషయం తెలిసిందే. దీంతో రెండు దేశాల్లో ఫ్రూట్స్, వెజిటెబుల్స్, గోధుమలు, బియ్యం, చక్కెర, మందుల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా పాక్లో టమాటాల ధరలు 5 రెట్లు పెరిగి కిలో 600 పాకిస్థానీ రూపాయలు పలుకుతున్నాయి. యాపిల్స్ ధరలు సైతం భారీగా పెరిగాయి. వ్యాపారం స్తంభించిపోయిందని, 2 దేశాలు రోజుకు $1M నష్టపోతున్నాయని అక్కడి వ్యాపార వర్గాలు తెలిపాయి.


