News October 20, 2024
‘బంగ్లాదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగొచ్చు’
బంగ్లాదేశ్లో 2025లో సాధారణ ఎన్నికలు జరగొచ్చని అక్కడి తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అంచనా వేశారు. ఎన్నికలు నిర్వహించడానికి ముందు చాలా అంశాలను పరిష్కరించాల్సి ఉందన్నారు. రాజకీయ సంస్కరణలు, సెర్చ్, ఎన్నికల కమిటీల ఏర్పాటు, ఓటరు జాబితా తయారీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై చెలరేగిన అల్లర్లతో PMగా షేక్ హసీనా తప్పుకుని దేశం వీడారు. అప్పటి నుంచి బంగ్లాలో రాజకీయ అనిశ్చితి నెలకొంది.
Similar News
News October 20, 2024
సర్ఫరాజ్పై అనిల్ కుంబ్లే ప్రశంసలు
న్యూజిలాండ్తో తొలి టెస్టులో 150 పరుగులతో రాణించిన సర్ఫరాజ్ ఖాన్పై మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. కివీస్ స్పిన్నర్లపై సర్ఫరాజ్ ఆధిపత్యం చెలాయించారని, పేస్ బౌలింగ్లోనూ నిలకడగా ఆడారని కొనియాడారు. బౌలర్లపై ఎలా ప్రెజర్ తీసుకురావాలో అతనికి బాగా తెలుసన్నారు. అతను ఎక్కువగా క్రీజులో నుంచి కదలకుండా గేమ్ ప్లాన్ అమలు చేస్తారని అన్నారు. కాగా రెండో ఇన్నింగ్సులో భారత్ 462 రన్స్ చేసింది.
News October 20, 2024
మెయిన్స్ పరీక్ష వాయిదా వేస్తే నష్టమేంటి: శ్రీనివాస్ గౌడ్
TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేస్తే వచ్చే నష్టమేంటని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అభ్యర్థుల్ని నిర్బంధిస్తూ పరీక్షలు నిర్వహించడం అవసరమా? అని ప్రశ్నించారు. వారికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. కేంద్రమంత్రి బండి సంజయ్ పొలిటికల్ జోకర్గా మారారని విమర్శించారు. మోదీకి ముగ్గురు తమ్ముళ్లని.. పెద్దోడు రేవంత్, నడిపోడు బండి, చిన్నోడు అరవింద్ అని ఎద్దేవా చేశారు.
News October 20, 2024
గుర్లలో డయేరియా తగ్గుముఖం పట్టింది: మంత్రి కొండపల్లి
AP: భూగర్భ జలాల కలుషితం వల్లే విజయనగరం జిల్లా గుర్లలో అతిసారం వ్యాప్తి చెందిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం గుర్లలో అతిసారం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. 41 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. క్లోరినేషన్ పనులు చేపట్టామని, ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం తాగునీటి వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు.