News March 22, 2025
బ్యాంకుల సమ్మె వాయిదా

ఈనెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ప్రకటించింది. వారంలో ఐదు రోజుల పని, అన్ని క్యాడర్లలో తగినన్ని నియామకాలు చేపట్టడం వంటి డిమాండ్ల విషయంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA), కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
Similar News
News December 29, 2025
గర్భిణులు శివలింగాన్ని పూజించవచ్చా?

గర్భిణులు శివలింగాన్ని నిరభ్యంతరంగా పూజించవచ్చని పండితులు చెబుతున్నారు. దీనికి ఎటువంటి నిషేధం లేదంటున్నారు. శివారాధన వల్ల తల్లికి మానసిక ప్రశాంతత, బిడ్డకు రక్షణ లభిస్తాయని సూచిస్తున్నారు. అయితే శరీరాన్ని కష్టపెట్టే కఠిన ఉపవాసాలు, నియమాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎక్కువ సేపు నిలబడకుండా కూర్చుని పూజ చేయాలంటున్నారు. గుడికి వెళ్లలేని వారు ఇంట్లోనే చిన్న శివలింగానికి పూజ చేయవచ్చని అంటున్నారు.
News December 29, 2025
‘దశరథ గడ్డి’తో పాడి పశువులు, జీవాలకు కలిగే ఉపయోగాలివే..

☛ దశరథ గడ్డిని ఆవులు, గేదెలకు ప్రతిరోజూ 2 కేజీల చొప్పున ఇస్తే పాల దిగుబడి, వెన్నశాతం వృద్ధి చెందుతుంది.
☛ మేకలు, గొర్రెలకు దాణా బదులుగా 50 శాతం ఈ గడ్డిని ఆహారంగా ఇస్తే వాటి పెరుగుదల బాగుంటుంది.
☛ లేయర్ (ఆడ) కోడిపిల్లలకు ఆహారంలో 6 శాతం ఈ గడ్డిని ముక్కలు చేసి వేస్తే గుడ్ల నాణ్యత పెరుగుతుంది.
☛ కుందేళ్లు, పందులకు ఈ గడ్డిని అందిస్తే వాటి పెరుగుదల వేగంగా ఉంటుంది.
News December 29, 2025
న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. వాళ్లిద్దరికీ రెస్ట్?

న్యూజిలాండ్తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే T20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చని cricbuzz తెలిపింది. అయితే ODIలకు దూరమైనా NZతో 5T20ల సిరీస్లో మాత్రం ఆడతారని పేర్కొంది. జనవరి 11-31 మధ్య 3 ODIలు, 5T20లు జరగనున్నాయి. ODIల్లో వెటరన్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ ఆడనున్నారు.


