News October 31, 2024

అదానీ రూ.20వేల కోట్ల లోన్.. పంచుకోవడానికి రెడీగా బ్యాంకులు!

image

అదానీ పెట్రో కెమికల్ యూనిట్‌ రూ.20వేల కోట్ల లోన్‌ను పంచుకొనేందుకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు క్యూ కట్టాయని తెలిసింది. ఈ PVC ప్రాజెక్టుకు 9.25% వడ్డీతో 15 ఏళ్ల క్రెడిట్‌లైన్‌‌ను SBI ఆమోదించింది. ఇప్పటికే కొన్ని రూ.వందల కోట్లను విడుదల చేసింది. ఎక్స్‌పోజర్ తగ్గించుకొనేందుకు రూ.7000 కోట్ల వరకు ఉంచుకొని మిగతాది పంచేయాలని SBI నిర్ణయించుకుంది. BOB, PNB, UBI, CBI, ICICI, AXIS దీనికి రెడీగా ఉన్నాయి.

Similar News

News November 28, 2025

ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ కాదు: UP

image

ఆధార్ కార్డు విషయంలో అన్ని విభాగాలకు ఉత్తర్‌ప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ కీలక ఆదేశాలిచ్చింది. ఇకపై ఆధార్ కార్డును బర్త్ సర్టిఫికెట్‌గా, ప్రూఫ్ ఆఫ్ బర్త్‌గా గుర్తించడానికి వీల్లేదని పేర్కొంది. ‘ఆధార్‌కు జనన ధ్రువీకరణ పత్రం జత చేయరు. కాబట్టి ఇకపై దానిని బర్త్ సర్టిఫికెట్‌గా గుర్తించేందుకు వీల్లేదు’ అని ప్లానింగ్ విభాగం ప్రత్యేక కార్యదర్శి అమిత్ సింగ్ బన్సాల్ ఆదేశాలు జారీ చేశారు.

News November 28, 2025

శరవేగంగా అమరావతి పనులు: మంత్రి లోకేశ్

image

AP: రైతుల త్యాగ ఫలితమే అమరావతి అని మంత్రి లోకేశ్ చెప్పారు. గత ప్రభుత్వం దీన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నినాదంతో 1,631 రోజులపాటు రైతులు ఉద్యమం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు.

News November 28, 2025

WPL వేలంలో అదరగొట్టిన తెలుగమ్మాయిలు

image

WPL 2026 వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్లేయర్స్ సత్తా చాటారు. గొంగడి త్రిషను రూ.10 లక్షలకు యూపీ వారియర్స్‌, మమతను రూ.10 లక్షలకు ఢిల్లీక్యాపిటల్స్‌, క్రాంతిరెడ్డిని రూ.10 లక్షలకు ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకున్నాయి. అరుంధతి రెడ్డిని రూ.75 లక్షలకు RCB జట్టు ఎంచుకుంది. ఇటీవలి వన్డే వరల్డ్‌ కప్‌ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన నల్లపు రెడ్డి శ్రీచరణిని రూ.1.30 కోట్లతో ఢిల్లీ తిరిగి సొంతం చేసుకుంది.