News October 2, 2024
స్త్రీ శక్తిని నమ్మిన బాపూజీ

మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్య పోరాటంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు. సహాయ నిరాకరణ, మద్యపాన నిషేధ బాధ్యతలను మహిళలకే అప్పగించారు. లింగభేదాన్ని బాపూ తీవ్రంగా వ్యతిరేకించేవారు. మహిళలను బలహీనవర్గంగా పరిగణించడమంటే వాళ్లను అవమానించినట్లేనని చెప్పేవారు. సీత, ద్రౌపది, దమయంతి లాంటి పురాణ స్త్రీల గురించి ఎక్కువగా ప్రస్తావించేవారు.
Similar News
News November 3, 2025
ఇలా చేస్తే తిరుమలలో వేగంగా దర్శనం!

శ్రీవారి దర్శనానికి ఎన్నో దారులున్నాయి. వీటిలో రక్తదానం చేసినవారికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు దీనిని 1985లో ప్రారంభించినా చాలామందికి ఇది తెలియదు. రక్తదాతలకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్తో పాటు ఒక లడ్డూ & ప్రశంసాపత్రాన్ని అందిస్తారు. ఇందుకోసం కొండపై ఉన్న అశ్విని ఆస్పత్రిలో రోజూ పరిమిత వ్యక్తులు రక్తదానం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. Share it
News November 3, 2025
వరల్డ్ కప్ విన్.. BJP&కాంగ్రెస్ శ్రేణుల ఫైట్

ప్రధాని మోదీ హాజరైతే అందులో భారత్కు ఓటమి తప్పదని కాంగ్రెస్ శ్రేణులు ట్వీట్లు చేస్తున్నాయి. ‘మోదీ హాజరైన చంద్రయాన్-2 & 2023 క్రికెట్ ప్రపంచకప్లో భారత్ విఫలమైంది. అదే మోదీ గైర్హాజరైన చంద్రయాన్-3, 2024 T20 WC, 2025 WWC వంటి వాటిలో భారత్ గెలిచింది. అంటే మోదీ హాజరుకు, వైఫల్యానికి సంబంధం ఉంది’ అని సెటైర్ వేస్తున్నాయి. రాహుల్ గాంధీ ఉండటం వల్లే కాంగ్రెస్ ఓడిపోతోందని బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.
News November 3, 2025
విషాదం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర <<18183462>>బస్సు ప్రమాదంలో<<>> ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించారు. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్కు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కూతురి పెళ్లి కోసం ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్ నుంచి సొంతూరుకు వచ్చారు. ఈ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగి చనిపోయారు.


