News July 4, 2024

బాసర ట్రిపుల్ ఐటీ: కౌన్సెలింగ్ తేదీలు ఇవే

image

TG: బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి అర్హులైన వారి జాబితా విడుదలయింది. ఎంపికైన విద్యార్థులకు జులై 8, 9, 10 తేదీల్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. మొత్తం 1,404 సీట్లు ఉండగా.. అత్యధికంగా సిద్దిపేట జిల్లా నుంచి 330, నిజామాబాద్ జిల్లా నుంచి 157 మంది ఎంపికయ్యారు. పూర్తి వివరాలకు https://www.rgukt.ac.in/ సైట్ చూడండి.

Similar News

News March 12, 2026

ఇరాన్ యుద్ధం.. భారత్‌కు బిగ్ రిలీఫ్

image

క్రూడాయిల్ రవాణాకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిలో భారత నౌకల రవాణాకు ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు NDTV తెలిపింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీతో చర్చల తర్వాత ఈ నిర్ణయం వెలువడినట్లు పేర్కొంది. దీంతో పుష్పక్, పరిమల్ అనే ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ల ద్వారా గల్ఫ్ దేశాల ఆయిల్‌ను మనం సులభంగా దిగుమతి చేసుకోవచ్చు. అటు US, యూరప్, ఇజ్రాయెల్ దేశాల నౌకలపై ఆంక్షలు కొనసాగనున్నాయి.

News March 12, 2026

సాయుధ బలగాల్లో 93,139 ఉద్యోగాలు: నిత్యానంద రాయ్

image

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్(CAPF), అస్సాం రైఫిల్స్‌లో 93,139 ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంటులో వెల్లడించారు. CISF-28,342, CRPF-27,400, BSF-14,531, ITBP-12,333, SSB-6,784, అస్సాం రైఫిల్స్-3,749 ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. UPSC, SSC ద్వారా ఏటా పోస్టుల భర్తీ కొనసాగుతోందని చెప్పారు.

News March 12, 2026

మళ్లీ 100 డాలర్లకు ఆయిల్ ధర

image

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $100 దాటింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత $120 చేరువైన రేట్లు.. ఉద్రిక్తతలు ముగింపునకు వచ్చిందన్న ట్రంప్ ప్రకటనతో ఇటీవల $89కు దిగొచ్చాయి. కానీ తాజాగా హార్ముజ్‌లో చమురు నౌకలపై ఇరాన్ దాడి, ఇరాక్ సహా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ నిల్వ కేంద్రాలపై దాడితో ఆయిల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.