News September 21, 2025
అమ్మవారిని మేల్కొలిపిన పూల పండుగే ‘బతుకమ్మ’

దుర్గాదేవి మహిషాసుర సంహారం తర్వాత అలసి నిద్రలోకి జారుకోగా, భక్తులు ఆమెను మేల్కొల్పడానికి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించారని పండితులు చెబుతున్నారు. గౌరీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన పూలను భక్తులు ఒకచోట పేర్చి ఆమె కోసం ఆరాధనలు, సంకీర్తనలు చేసి, వేడుకున్నారని ప్రతీతి. ఈ భక్తి, అంకితభావానికి మెచ్చి అమ్మవారు మేల్కొన్నారని, అలా బతుకమ్మ పండుగ ఉద్భవించిందని నమ్ముతారు.
Similar News
News September 21, 2025
BCCI కొత్త అధ్యక్షుడు ఇతడేనా?

జమ్మూకశ్మీర్కు చెందిన మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడి రేసులో ముందున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. రోజర్ బిన్నీ తర్వాత ఇతడికే పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఇవాళ ఢిల్లీలో జరిగే వార్షిక సమావేశంలో కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు. ఢిల్లీ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన మిథున్ 9వేలకు పైగా రన్స్ చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు. IPL(2008-14)లో ఆడిన తొలి J&K ప్లేయర్గా నిలిచారు.
News September 21, 2025
మండోదరి పాత్రలో పూనమ్.. వ్యతిరేకిస్తున్న BJP, VHP!

ఢిల్లీలో జరిగే ‘రామ్లీల’ ఈవెంట్లో రావణుడి భార్య మండోదరి పాత్రలో నటించేందుకు పూనమ్ పాండేను తీసుకోవడంపై స్థానిక BJP, VHP నేతలు అభ్యంతరం తెలిపారు. ఆమెను మరొకరితో రీప్లేస్ చేయాలని లవ్కుశ్ రామ్లీల కమిటీని కోరారు. పూనమ్ తన ఫొటోలు, వీడియోలతో ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ చేశారని గుర్తుచేశారు. అయితే ఇందులో తమకు ఏ తప్పూ కనిపించలేదని, ప్రతి ఒక్కరూ అవకాశం పొందేందుకు అర్హులని కమిటీ ప్రెసిడెంట్ బదులిచ్చారు.
News September 21, 2025
APSRTCలో 281 ఉద్యోగాలు

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. APSRTCలో 281 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం రీజియన్లలో డీజిల్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్ ఉద్యోగాలున్నాయి. టెన్త్, సంబంధిత ట్రేడుల్లో ITI ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ OCT 4. పూర్తి వివరాల కోసం <
#ShareIt