News April 4, 2024
ఐపీఎల్లో బ్యాటింగ్ చాలా ఈజీ: జునైద్ ఖాన్

ఐపీఎల్పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జునైద్ ఖాన్ నోరుపారేసుకున్నారు. ఈ టోర్నీలో బ్యాటింగ్ చేయడం చాలా సులభం అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘ఐపీఎల్లో అన్నీ ఫ్లాట్ పిచ్లు. వాటిపై బ్యాటింగ్ చేయడం చాలా సులభం. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు కేవలం 155 రన్స్ చేసిన సునీల్ నరైన్ ఒక ఐపీఎల్ మ్యాచ్లోనే 85 పరుగులు చేశారు’ అంటూ జునైద్ ట్వీట్ చేశారు. దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Similar News
News November 13, 2025
వచ్చే ఏడాది రూ.3 కోట్ల ఆదాయం లక్ష్యం

పాడి పశువుల పోషణలో మణిబెన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటికి మేలైన పచ్చగడ్డి, దాణా అందిస్తున్నారు. ఒక పశువు నుంచి మెషిన్ సాయంతో 9-14 లీటర్ల పాలను తీస్తున్నారు. 16 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం వీరి దగ్గర 140 పెద్ద గేదెలు, 90 ఆవులు, 70 దూడలున్నాయి. మరో 100 గేదెలను కొనుగోలు చేసి, డెయిరీ ఫామ్ను విస్తరించి వచ్చే ఏడాది 3 కోట్ల వ్యాపారం చేయాలని మణిబెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
News November 13, 2025
మరికాసేపట్లో పెద్ద ప్రకటన: లోకేశ్

AP: ఇవాళ ఉదయం 9 గంటలకు పెద్ద ప్రకటన చేయనున్నట్లు మంత్రి లోకేశ్ Xలో పోస్టు చేశారు. 2019 నుంచి కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తుఫానులా తిరిగివస్తోందన్నారు. ఆ కంపెనీ ఏదో 9amకు వెల్లడిస్తానని పేర్కొన్నారు. దీంతో ఆ సంస్థ ఏంటని సర్వత్రా చర్చ జరుగుతోంది. మీరేం అనుకుంటున్నారు?
News November 13, 2025
భారీగా పెరిగిన కూరగాయల ధరలు

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు వినియోగదారులను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. చాలా రకాల కూరగాయలు పావుకేజీ రూ.30కి తక్కువ లభించడం లేదు. అంటే కేజీ రూ.100-120 పలుకుతోంది. రైతు బజార్లతోపాటు వారపు సంతల్లోనూ రేట్లు బెంబేలెత్తిస్తున్నాయి. ఆకుకూరల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇటీవల మొంథా తుఫాన్తో పంటలు తీవ్రంగా దెబ్బతినడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మీరూ కూరగాయల రేట్లతో షాక్ అయ్యారా?


