News October 7, 2025
ఈ నెలాఖరున బీసీ సభ: టీపీసీసీ చీఫ్

TG: ఈ నెలాఖరులో కామారెడ్డిలో BC సభ నిర్వహించనున్నట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. డిసెంబర్ నెలాఖరులోగా నామినేటేడ్, పార్టీ పదవులను భర్తీ చేస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్లో BC అభ్యర్థినే బరిలోకి దించుతామని స్పష్టం చేశారు. CM రేవంత్, మీనాక్షి నటరాజన్తో మరోసారి చర్చించి ఆశావహుల పేర్లను AICCకి పంపుతామన్నారు. ఆ తర్వాత 2-3 రోజుల్లో పార్టీ అధిష్ఠానం అభ్యర్థి పేరును ప్రకటిస్తుందన్నారు.
Similar News
News January 27, 2026
వీరు కాఫీ తాగితే ప్రమాదం

రోజూ తగినంత మోతాదులో కాఫీ తాగే వారిలో అల్జీమర్స్, టైప్-2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. గర్భవతులు, బాలింతలు కాఫీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఒకవేళ తాగినా 200 మిల్లీ లీటర్లు తాగాలని సూచిస్తున్నారు. అలాగే మెటబాలిజమ్ స్లోగా ఉన్నవారు, యాంగ్జైటీ సమస్యలు ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News January 27, 2026
మొక్కుబడులు చెల్లించకపోతే చెడు జరుగుతుందా?

మొక్కుబడులు చెల్లించకపోతే దేవుడికి కోపం వస్తుందని అంతా భయపడతారు. కానీ తల్లికి బిడ్డల మీద కోపం రానట్లే దేవుడు కూడా మొక్కులు తీర్చలేదని కష్టాలు పెట్టడు. ఆయన మన నుంచి కేవలం ధర్మబద్ధమైన జీవనాన్నే కోరుకుంటాడు. మనం చేసే కర్మానుసారమే సుఖదుఃఖాలు కలుగుతాయి. మొక్కులు మరచిపోవడం అనేది మన బలహీనత. దేవుడు ఎప్పుడూ సత్యం, మాట మీద నిలబడమని చెబుతాడు. ఆ నియమాన్ని మీరితే అది మన సమస్యే అవుతుంది.
News January 27, 2026
కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ఆశలు

AP: కేంద్ర బడ్జెట్పై రాష్ట్రం ఈసారి అనేక ఆశలు పెట్టుకుంది. అమరావతికి చట్టబద్ధత, పోలవరం పూర్తికి తగిన నిధులు అందించాలని ఇప్పటికే విన్నవించింది. రాజస్థాన్లో ₹40000CRతో నదుల అనుసంధానం చేపడుతున్నందున నల్లమలసాగర్కూ నిధులివ్వాలని కోరుతోంది. డేటా సెంటర్ వంటి సంస్థలతో ప్రాధాన్యం సంతరించుకున్న విశాఖ ఎకనమిక్ జోన్ అభివృద్ధికి ₹5వేల కోట్లు ఆశిస్తోంది. వివిధ మెగా ప్రాజెక్టులకూ నిధులపై ఆశాభావంతో ఉంది.


