News September 5, 2024
సెప్టెంబర్ 29న BCCI ఏజీఎం.. NCA ప్రారంభోత్సవం

బెంగళూరులో సెప్టెంబర్ 29న బీసీసీఐ 93వ ఏజీఎం జరగనుంది. ఇప్పటికే 18 అంశాలతో కూడిన అజెండాను రాష్ట్ర సంఘాలకు పంపించారు. ఐసీసీకి వెళ్తున్న జైషా స్థానంలో మరొకర్ని ఈ సమావేశంలో ఎన్నుకొనే అవకాశం లేదని తెలిసింది. డిసెంబర్ 1న ఆయన ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు తీసుకుంటారు. అయితే ఏజీఎం రోజే జరిగే కొత్త NCA ప్రారంభోత్సవంలో బోర్డు సభ్యులు పాల్గొంటారు. కొత్త కార్యదర్శి ఎంపికకు SGM నిర్వహిస్తారని సమాచారం.
Similar News
News November 6, 2025
తెలంగాణ న్యూస్ అప్డేట్స్ @2PM

*రేపు జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ ఈ నెల 12కు వాయిదా
*హైదరాబాద్ బోరబండలో బండి సంజయ్ కార్నర్ మీటింగ్కు అనుమతి రద్దు చేశారంటూ బీజేపీ నేతల ఆందోళన.. సభ జరిపి తీరుతామని స్పష్టం
*జూబ్లీహిల్స్లో 3 పార్టీల మధ్య గట్టి పోటీ ఉందన్న కిషన్ రెడ్డి
*ఫిరాయింపు MLAలు తెల్లం వెంకట్రావు, సంజయ్లను నేడు విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
News November 6, 2025
సమగ్ర వ్యవసాయ విధానాలు (మోడల్స్)

☛ పంటలు + పశువులు +జీవాల పెంపకం.
☛ పంటలు + పశువులు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపల పెంపకం
☛ పంటలు + పశువులు + కోళ్లు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపలు + పుట్టగొడుగుల పెంపకం
☛ పంటలు + పశువులు + వర్మీ కంపోస్ట్ + చేపల పెంపకం
☛ పశువులు+ జీవాలు + కోళ్ల పెంపకం.. వాతావరణం, రైతు స్థితి, సహజ వనరులను బట్టి <<18185953>>సమగ్ర వ్యవసాయ<<>> అనుబంధ రంగాలను ఎంచుకోవచ్చు.
News November 6, 2025
ఓటేసేందుకు బిహారీల పాట్లు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ కోసం తెలుగు రాష్ట్రాల్లోని బిహారీలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. HYDలో 10-12 లక్షల మంది బిహారీలు ఉండగా AP, TGలో కలిపి ఈ సంఖ్య 15 లక్షల మందికి పైగానే ఉంటుంది. ఇవాళ, NOV 11న పోలింగ్ కోసం ఇప్పటికే ట్రైన్ టికెట్స్ బుక్ అయి వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. రైల్వే శాఖ 12వేల స్పెషల్ సర్వీసులు నడుపుతామని ప్రకటించినా రియాల్టీలో కన్పించక ఓటర్లు కష్టాలు పడుతున్నారు.


