News January 4, 2025
BCCI: జైషా వారసుడిగా దేవజిత్ సైకియా!

BCCI సెక్రటరీగా దేవజిత్ సైకియా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. DEC 1న ICC ఛైర్మన్గా జైషా వెళ్లిపోయాక సైకియా తాత్కాలిక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. SAT 4PMకు గడువు ముగిసేలోపు మరెవ్వరూ నామినేషన్లు వేయకపోవడంతో ఆయన ఎంపిక లాంఛనమే. ఇక ట్రెజరర్ స్థానానికి ఛత్తీస్గఢ్ క్రికెట్ సంఘం సభ్యుడు ప్రభుతేజ్ భాటియా ఎంపికవ్వనున్నారు. ఆశీశ్ షెలార్కు మహారాష్ట్రలో మంత్రి పదవి దక్కడంతో ఈ స్థానం ఖాళీ అయింది.
Similar News
News December 13, 2025
బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఫలితాల వెల్లడిలో మార్పులు

బ్యాంక్ ఉద్యోగాల నియామకాల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. SBI, నేషనల్ బ్యాంకులు, RRB (Regional Rural Banks)ల పరీక్షా ఫలితాల ప్రకటన క్రమాన్ని మార్చింది. ఇకపై ముందుగా SBI, ఆ తర్వాత నేషనల్ బ్యాంకులు, చివరగా RRBల ఫలితాలను విడుదల చేస్తారు. అదే విధంగా ముందుగా PO (Probationary Officer) రిజల్ట్స్ తరువాత క్లరికల్వి ప్రకటించనున్నారు. దీనివల్ల అభ్యర్థులు మంచి ఉద్యోగాన్ని సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
News December 13, 2025
MLAల చేతుల్లో MRO ఆఫీసులు: ధర్మాన

AP: భూ సమస్యలు తీరక సామాన్యులు బాధపడుతున్నారని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ‘5 సెంటీమీటర్ల తేడా కూడా లేకుండా కొలతలు చేయగల టెక్నాలజీతో భూ సర్వే జరుపుతుంటే, సర్టిఫికెట్పై జగన్ బొమ్ముందని, భూములు ఆయన తీసుకుంటారని చంద్రబాబు మాయ మాటలు చెప్పారు. ఇన్నేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఒక్క భూ సంస్కరణ అయినా తెచ్చారా? నేడు ఎమ్మార్వో కార్యాలయాలన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లిపోయాయి’ అని విమర్శించారు.
News December 13, 2025
కార్పొరేటర్గా గెలిచిన మాజీ DGP

కేరళ మాజీ DGP ఆర్.శ్రీలేఖ కార్పొరేటర్గా గెలిచారు. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, శాస్తమంగళం డివిజన్ నుంచి విజయం సాధించారు. కేరళ తొలి మహిళా ఐపీఎస్గా 1987లో శ్రీలేఖ ఎంపికయ్యారు. సీబీఐలో డిప్యూటేషన్పై పని చేసిన సమయంలో హైప్రొఫైల్ ఆపరేషన్లతో ‘రైడ్ శ్రీలేఖ’గా పేరు పొందారు. 33 ఏళ్ల సర్వీసు తర్వాత 2020లో డీజీపీ హోదాలో రిటైర్ అయ్యారు. తర్వాత బీజేపీలో చేరారు.


