News December 7, 2024

బీసీసీఐ సరైన పని చేసింది: యూసుఫ్

image

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియాను పాకిస్థాన్ పంపించకుండా బీసీసీఐ సరైన పని చేసిందని మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ అభిప్రాయపడ్డారు. ‘బీసీసీఐ ఎప్పుడూ భారత ఆటగాళ్ల భద్రత గురించే ముందు ఆలోచిస్తుంది. ఆదాయం కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తుంది’ అని కొనియాడారు. వచ్చే ఏడాది పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా.. ఆ దేశంలో తమ మ్యాచుల్ని ఆడేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

Similar News

News December 4, 2025

తెలంగాణలో అఖండ-2 టికెట్ రేట్ల పెంపు

image

‘అఖండ-2’ సినిమా టికెట్ రేట్ల <<18450771>>పెంపునకు<<>> TG ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ రా.8 గంటల నుంచి ప్రీమియర్స్ మొదలవనున్నట్లు పేర్కొంది. ప్రీమియర్ షో టికెట్ రేట్‌ను రూ.600గా నిర్ధారించింది. తర్వాతి 3 రోజులు సింగిల్ స్క్రీన్‌కు రూ.50, మల్టీప్లెక్స్‌లకు రూ.100 చొప్పున పెంచుకోవచ్చని తెలిపింది. టికెట్ రేట్ల పెంపుతో వచ్చే రెవెన్యూలో 20% మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఇవ్వాలని GOలో పేర్కొంది.

News December 4, 2025

చనిపోయినట్లు నటించే బ్యాక్టీరియా!

image

అత్యంత అరుదైన బ్యాక్టీరియా(టెర్సికోకస్ ఫీనిసిస్)ను US సైంటిస్టులు కనుగొన్నారు. స్పేస్‌క్రాఫ్ట్ అసెంబ్లీ రూమ్స్ లాంటి భూమిపై ఉన్న అతి పరిశుభ్రమైన వాతావరణాలలోనూ ఇది జీవించగలదని తెలిపారు. ‘తన మనుగడను కొనసాగించడానికి చనిపోయినట్లు నటిస్తుంది. వీటిని గుర్తించడం, నాశనం చేయడం కష్టం. ఏదైనా బ్యాక్టీరియా వ్యాప్తి కట్టడికి కఠినమైన శుభ్రతా ప్రమాణాలు ఎందుకు పాటించాలో ఇలాంటివి నిరూపిస్తాయి’ అని పేర్కొన్నారు.

News December 4, 2025

మనసునూ పట్టించుకోవాలి: సారా అలీఖాన్

image

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలాముఖ్యమని బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ అంటున్నారు. భావోద్వేగాలను అణిచివేయడం బలం కాదు. వాటిని అంగీకరించే ధైర్యం కలిగి ఉండటం ముఖ్యం అంటున్నారు. ప్రస్తుత తరం మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టట్లేదు. శరీరానికి ఇచ్చే శ్రద్ధ మనసుకు కూడా ఇస్తేనే మనం బలంగా ఉన్నట్లు అర్థం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక శ్రేయస్సు గురించి కూడా చర్చించాలంటున్నారు.