News June 21, 2024

అఫ్గాన్‌కు బీసీసీఐ మరోసారి ఆపన్నహస్తం

image

మరోసారి అఫ్గానిస్థాన్‌కు బీసీసీఐ అండగా నిలిచింది. బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌ను ఆ జట్టు భారత్‌లో ఆడేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. అన్ని మ్యాచ్‌లూ నోయిడా స్టేడియం కాంప్లెక్స్‌లో జరగనున్నాయి. జులై 25 నుంచి ఆగస్టు 6 వరకు ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా 2017లో ఐర్లాండ్‌-అఫ్గాన్ సిరీస్‌ కూడా ఇదే వేదికలో జరిగిన సంగతి తెలిసిందే.

Similar News

News December 4, 2025

గుర్తింపు, పదవుల కోసం పాకులాడను: పవన్

image

AP: నిస్సహాయులకు అండగా నిలబడటమే నాయకుడి లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. చిత్తూరులో కూటమి కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. తాను గుర్తింపు, పదవుల కోసం పాకులాడలేదని తెలిపారు. ప్రజలకు సేవ చేసే ప్రయాణంలో పదవి వస్తే అలంకారం కాదు బాధ్యత అని నమ్ముతానన్నారు. అదృష్టవశాత్తు తన పేషీలోని అధికారులు కూడా సమాజానికి మంచి చేద్దాం అనే తపన ఉన్నవాళ్లేనని పేర్కొన్నారు.

News December 4, 2025

మన రూపాయికి విలువే లేదు: ఖర్గే

image

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల <<18465153>>కనిష్ఠ స్థాయి<<>>కి చేరడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. కేంద్ర ప్రభుత్వం వల్లే రూపాయి క్షీణిస్తోందని ఆరోపించారు. ‘కేంద్రం విధానాలు మన కరెన్సీని బలహీనపరిచాయి. అవే బాగుంటే రూపాయి పైకి ఎగిసేది. మన ఆర్థిక పరిస్థితి బాగా లేదని తెలుస్తోంది. మనకు నచ్చింది చెప్పుకోవచ్చు, మనల్ని మనం మెచ్చుకోవచ్చు. కానీ ప్రపంచంలో మన రూపాయికి విలువే లేదు’ అని ఫైరయ్యారు.

News December 4, 2025

నిర్మాత మృతి.. హీరో సూర్య కన్నీళ్లు

image

ప్రముఖ నిర్మాత, AVM స్టూడియోస్ అధినేత ఎం.శరవణన్(85) <<18464480>>భౌతికకాయానికి<<>> సీఎం స్టాలిన్, రజినీకాంత్ సహా అనేక మంది ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్థివ దేహాన్ని చూస్తూ హీరో సూర్య, ఆయన తండ్రి శివకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సూర్య నటించిన సుందరాంగుడు, వీడొక్కడే సినిమాలను ఏవీఎం సంస్థే తెరకెక్కించింది. కాగా శరవణన్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి.