News April 3, 2024
బీసీసీఐ ముందే అలా చేసి ఉండాల్సింది: సిద్ధూ

టీ20 ప్రపంచ కప్నకు రోహిత్ శర్మను బీసీసీఐ ముందే కెప్టెన్గా ప్రకటించి ఉండాల్సిందని మాజీ ప్లేయర్ సిద్ధూ అన్నారు. అలా చేసి ఉంటే ముంబై ఇండియన్స్ సారథిగా కొనసాగి ఉండేవారని అభిప్రాయపడ్డారు. గత ఏడాది అక్టోబర్లో రోహిత్ను టీ20 WCకు కెప్టెన్గా ప్రకటిస్తే బాగుండేదన్నారు. భారత హీరో, టీమ్ ఇండియా సారథిని ముంబై కెప్టెన్గా తొలగించడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు.
Similar News
News January 6, 2026
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మరోసారి ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారు. ఆమె తీవ్ర దగ్గుతో బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సోనియాను అబ్జర్వేషన్లో ఉంచినట్లు పేర్కొన్నాయి. అయితే ప్రమాదమేమీ లేదని, రెగ్యులర్ చెకప్లో భాగంగానే ఆస్పత్రికి వెళ్లినట్లు వెల్లడించాయి.
News January 6, 2026
నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ (<
News January 6, 2026
భూమిపైకి అంతరిక్ష ధూళి.. గుర్తించిన ఇస్రో ‘DEX’

భూమిపైకి ప్రతి 1000 సెకన్లకు ఒకసారి కాస్మిక్ డస్ట్ దూసుకొస్తోంది. ఇస్రో సొంతంగా తయారుచేసిన DEX (Dust EXperiment) పరికరం ఈ విషయాన్ని తాజాగా గుర్తించింది. తోకచుక్కలు, గ్రహశకలాల నుంచి ఈ ధూళి కణాలు వేగంగా భూ వాతావరణంలోకి చేరుతుంటాయి. PSLV-C58 మిషన్ ద్వారా పంపిన ఈ డస్ట్ డిటెక్టర్ అంతరిక్షంలో శాటిలైట్లకు ఉండే ముప్పును అంచనా వేయడానికి సాయపడుతుంది. భవిష్యత్తు అంతరిక్ష పరిశోధనలకు ఈ డేటా ఎంతో కీలకం.


