News January 11, 2025

నేడు బీజీటీపై బీసీసీఐ సమీక్ష

image

బోర్డర్ గవాస్కర్‌ సిరీస్‌లో భారత్ ఘోర ప్రదర్శనపై బీసీసీఐ ఈరోజు సమీక్షించనుంది. బోర్డు పెద్దలు పాల్గొనే ఈ సమావేశంలో రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ తమ వివరణను ఇవ్వనున్నారు. భవిష్య టెస్టు జట్టు కూర్పుపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను భారత్ 1-3 తేడాతో కోల్పోయింది. పదేళ్లలో ఈ సిరీస్ ఓటమి ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Similar News

News November 22, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

*రేపు ఉ.10.08 గంటలకు నాగ చైతన్య మూవీ(NC24) టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్న మహేశ్
*మహిళలు ఏకమైతే వారి శక్తిని ఎవరూ ఆపలేరు: రష్మిక
*జనవరి 8న నార్త్ అమెరికాలో 8AM PST(ఇండియాలో 9.30PM)కి ప్రభాస్ రాజాసాబ్ చిత్రం వరల్డ్ ఫస్ట్ ప్రీమియర్
*వారణాసిలో అద్భుతమైన సంగీతం ఉంటుంది. మొత్తం 6 పాటలు ఉంటాయి: కీరవాణి
*నా ‘మాస్క్’ చిత్రం విజయం సాధిస్తే.. పిశాచి-2 మూవీని నేనే రిలీజ్ చేస్తా: హీరోయిన్ ఆండ్రియా

News November 22, 2025

గర్భిణులు రోజుకెంత ఉప్పు తీసుకోవాలంటే..

image

గర్భిణులు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరు ఎక్కువ ఉప్పు తింటే మరికొందరు తక్కువ ఉప్పు తింటారు. కానీ గర్భిణులు రోజుకి 3.8గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరీ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే 5.8గ్రాముల వరకు తీసుకోవచ్చు. దీని కంటే ఎక్కువగా తీసుకుంటే కాళ్లు, చేతుల వాపులు, తరచుగా మూత్రవిసర్జన, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయని గైనకాలజిస్ట్‌లు చెబుతున్నారు.

News November 22, 2025

APPLY NOW: సింగరేణిలో 82 పోస్టులు

image

సింగరేణిలో 82 ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టులను ఇంటర్నల్ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని ఈనెల 26లోగా పంపాలి. బేసిక్ శాలరీ నెలకు రూ.50,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: scclmines.com