News July 6, 2024
ధైర్యంగా ఉండండి: YS జగన్ భరోసా

AP: TDP నేతల విధ్వంసాలు, అరాచకాలతో ఇబ్బంది పడుతున్న కేడర్కు అండగా ఉంటామని YCP అధినేత జగన్ భరోసా ఇచ్చారు. కొందరు ఊళ్లు వదిలి పక్క రాష్ట్రాల్లో ఉంటున్నట్లు పార్టీ నేతలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని జగన్ చెప్పారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ MLA కాసు మహేశ్ రెడ్డి సహా పలువురు జగన్ను కలిశారు.
Similar News
News January 11, 2026
కాంగ్రెస్తో పొత్తుకు డీఎంకే గుడ్ బై?

ఈ సారి తమిళ రాజకీయాలు సరికొత్త మలుపు తీసుకోనున్నాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే పొత్తు లేనట్లేనని తెలుస్తోంది. హస్తం పార్టీ సీట్ల షేరింగ్ ప్రపోజల్ను స్టాలిన్ తిరస్కరించినట్లు సమాచారం. ఇక కూటమి ప్రభుత్వం ఉండబోదన్న DMK నేత, మంత్రి పెరియస్వామి మాటలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. మరోవైపు హీరో విజయ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తుకు సిద్ధమైందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
News January 11, 2026
మైలురాళ్ల రంగుల గురించి తెలుసా?

*పసుపు: నేషనల్ హైవేలను సూచిస్తుంది. రాష్ట్రాలు, ప్రధాన నగరాలను కలిపే ఈ రోడ్లను NHAI మెయింటెన్ చేస్తుంది.
*గ్రీన్: ఇది స్టేట్ హైవేను సూచిస్తుంది. ఒక రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలను కనెక్ట్ చేస్తుంది.
*బ్లాక్: సిటీ, జిల్లా రోడ్లను సూచిస్తుంది. అర్బన్ సెంటర్లు, మున్సిపాలిటీలను కలుపుతుంది.
*ఆరెంజ్: గ్రామాల రోడ్లను సూచిస్తుంది. PMGSY స్కీమ్ ద్వారా వీటిని అభివృద్ధి చేస్తారు.
News January 11, 2026
ట్రంప్ టారిఫ్స్.. TNలో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

ఇండియాపై ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల తమ రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు రిస్క్లో పడ్డాయని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ‘TN గూడ్స్ ఎగుమతుల్లో 31% USకే వెళ్తాయి. సుంకాల వల్ల టెక్స్టైల్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. 30 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. MSMEలు మూతబడేలా ఉన్నాయి’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగమ్ తెన్నరసు చెప్పారు. వస్త్ర రంగం కోసం ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.


