News July 6, 2024
ధైర్యంగా ఉండండి: YS జగన్ భరోసా

AP: TDP నేతల విధ్వంసాలు, అరాచకాలతో ఇబ్బంది పడుతున్న కేడర్కు అండగా ఉంటామని YCP అధినేత జగన్ భరోసా ఇచ్చారు. కొందరు ఊళ్లు వదిలి పక్క రాష్ట్రాల్లో ఉంటున్నట్లు పార్టీ నేతలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని జగన్ చెప్పారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ MLA కాసు మహేశ్ రెడ్డి సహా పలువురు జగన్ను కలిశారు.
Similar News
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


