News March 13, 2025
నేటి నుంచి 5 రోజులు జాగ్రత్త

TG: రాష్ట్రంలో నేటి నుంచి 18 వరకు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, గద్వాల్, నారాయణ్ పేట్ జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది.
Similar News
News March 8, 2026
మరో స్టార్ హీరోతో నయనతార నయా ప్రాజెక్ట్!

ఏజ్ పెరుగుతున్నా నయనతార క్రేజ్ తగ్గట్లేదు. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్కి తగ్గట్లు స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. షారుఖ్ఖాన్తో ‘జవాన్’, చిరంజీవితో ‘MSVPG’లో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్కి జంటగా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
News March 8, 2026
ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు లేదు: SPDCL CMD

TG: ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు ఉండదని SPDCL CMD జితేశ్.వి.పాటిల్ స్పష్టం చేశారు. SPDCL పరిధిలో మొత్తం 1.20 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారని, గతేడాదితో పోలిస్తే 12.09L మంది పెరిగారని వెల్లడించారు. ‘గృహాజ్యోతి’ పథకం వల్ల విద్యుత్ చౌర్యం తగ్గిందన్నారు. ఈ ఏడాది FEB వరకు 5.44కోట్ల జీరో బిల్లులు జారీ చేయగా, ప్రభుత్వం నుంచి రూ.1930.66కోట్ల సబ్సిడీ డబ్బులు వచ్చాయని తెలిపారు.
News March 8, 2026
యుద్ధంలోకి వస్తామన్న UK? అవసరం లేదన్న ట్రంప్!

మిడిల్ ఈస్ట్కు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లను పంపాలని UK అనుకుంటున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. ‘ఒకప్పుడు మన గొప్ప మిత్ర దేశమైన UK ఎట్టకేలకు మిడిల్ ఈస్ట్కు రెండు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లను పంపించాలని తీవ్రంగా ఆలోచిస్తోంది. కానీ మాకు అవి అవసరం లేదు PM స్టార్మర్. మేం ఆల్రెడీ యుద్ధం గెలిచాం. ఇప్పుడు యుద్ధంలో చేరేవారు మాకు అవసరం లేదు’ అని ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు.


