News March 21, 2025

రానున్న 3 నెలలు జాగ్రత్త: సీఎస్ విజయానంద్

image

AP: రానున్న 3 నెలలు అధిక ఉష్ణోగ్రత, వడగాలుల పట్ల రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) కె.విజయానంద్ సూచించారు. వడగాలుల నుంచి ఉపశమనం పొందేందుకు ముందు జాగ్రత్త చర్యలు ముఖ్యమన్నారు. వడదెబ్బ తాకకుండా నీటిని అధికంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో ఈ మేరకు వీడియో సమావేశం ద్వారా సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

Similar News

News March 28, 2025

సెలవు రోజుల్లోనూ పని చేయనున్న కార్యాలయాలు

image

దేశవ్యాప్తంగా ఈనెల 29, 30, 31 తేదీల్లో ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఆఫీసులు పనిచేయనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈనెల 31తో ముగియనుండగా, ఆలోగా పన్ను చెల్లింపుదారులు పెండింగ్‌లో ఉన్న తమ ట్యాక్స్ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సెలవులున్నప్పటికీ కార్యాలయాలు పని చేస్తాయని CBDT తెలిపింది. అటు ఏపీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలూ 30, 31 తేదీల్లో పనిచేయనున్నాయి.

News March 28, 2025

IPL: నేడు కింగ్స్‌తో ఛాలెంజర్స్ ఢీ

image

IPL-2025లో భాగంగా ఇవాళ రా.7.30 గంటలకు చెన్నై వేదికగా CSK, RCB మధ్య మ్యాచ్ జరగనుంది. స్పిన్నర్లకు సహకరించే ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాల్లేవు. ఈ సీజన్‌లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ విజయంతో శుభారంభం చేశాయి. స్పిన్నర్ నూర్ అహ్మద్ నుంచి RCB బ్యాటర్లకు ముప్పు పొంచి ఉంది. RCB పేసర్ భువనేశ్వర్ నేటి మ్యాచులో బరిలోకి దిగుతారని సమాచారం. ఇందులో ఏ జట్టుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? COMMENT

News March 28, 2025

బాలికల గురుకులాల్లో పురుష సిబ్బంది ఉండొద్దు: ఎస్సీ సొసైటీ

image

TG: SC బాలికల గురుకులాలు, కాలేజీల్లోని అన్ని పోస్టుల్లో మహిళా సిబ్బందే ఉండాలని SC గురుకుల సొసైటీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీవో 1274 ఉత్తర్వులను యథావిధిగా అమలు చేయాలని తెలిపింది. బాలికల విద్యాలయాల్లో ఎవరైనా పురుష సిబ్బంది కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బాలుర స్కూళ్లు, కాలేజీలను జనరల్‌గా పరిగణించి వాటిలోని పోస్టులను మహిళలు, పురుషులతో భర్తీ చేస్తామని పేర్కొంది.

error: Content is protected !!