News April 4, 2024
ఇవాళ్టి నుంచి జాగ్రత్త

TG: రాష్ట్రంలో ఎండలు నిప్పులకొలిమిలా మారుతున్నాయి. ఈ వేసవిలో తొలిసారిగా 45డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో భానుడి ప్రతాపం అధికంగా ఉంది. నేటి నుంచి ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఎండలు, వడగాల్పులు అధికంగా ఉంటాయని IMD అంచనా వేసింది.
Similar News
News March 24, 2026
FLASH: మళ్లీ మారిన గోల్డ్ రేట్స్

పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇవాళ <<19461953>>ఉదయం<<>> భారీగా తగ్గిన ధరలు మధ్యాహ్నానికి స్వల్పంగా పుంజుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయంతో పోల్చితే రూ.2,560 పెరిగి రూ.1,42,910 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹2,350 ఎగబాకి రూ.1,31,000కు చేరుకుంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,40,000గా ఉంది.
News March 24, 2026
FLASH: మళ్లీ మారిన గోల్డ్ రేట్స్

పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇవాళ <<19461953>>ఉదయం<<>> భారీగా తగ్గిన ధరలు మధ్యాహ్నానికి స్వల్పంగా పుంజుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయంతో పోల్చితే రూ.2,560 పెరిగి రూ.1,42,910 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹2,350 ఎగబాకి రూ.1,31,000కు చేరుకుంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,40,000గా ఉంది.
News March 24, 2026
యుద్ధంపై రేపు ఆల్ పార్టీ మీటింగ్

పశ్చిమాసియా యుద్ధంతో భారత్లో నెలకొంటున్న సంక్షోభంపై చర్చించేందుకు కేంద్రం రేపు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనుంది. దేశంలోని ప్రస్తుత పరిస్థితులను నేతలకు వివరించనుంది. ఇప్పటికే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ దేశ భద్రతకు సంబంధించి ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. దీనికి CDS జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్, జనరల్ ఉపేంద్ర ద్వివేది, DRDO ఛైర్మన్ కామత్ తదితరులు హాజరయ్యారు.


