News April 27, 2024

ఆర్టీసీ సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించండి: ఎండీ సజ్జనార్

image

TG: విధుల్లో ఉన్న TSRTC సిబ్బందిపై దాడులు చేయడం క్షమించరాని నేరం అని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ‘సిబ్బందిపై దాడులను సంస్థ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులకు IPC 353 సెక్షన్ ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. పోలీస్ శాఖ సహకారంతో హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం. బస్సు డ్యామేజీ ఖర్చులను నిందితుల నుంచి వసూలు చేస్తాం. RTC సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించండి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 18, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,740 తగ్గి రూ.1,23,660కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,600 పతనమై రూ.1,13,350 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,70,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 18, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,740 తగ్గి రూ.1,23,660కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,600 పతనమై రూ.1,13,350 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,70,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 18, 2025

కొండెక్కిన ‘కోడిగుడ్డు’

image

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలతో పాటు కోడి గుడ్ల రేట్లు కూడా కొండెక్కుతున్నాయి. కార్తీక మాసం, అయ్యప్ప దీక్షల సమయంలో వినియోగం తగ్గినా రేటు పైపైకి వెళ్తోంది. జూన్‌లో ఫారం వద్ద ఒక్కో ఎగ్ ధర ₹4.60 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో ₹5.50 పలికింది. ఇప్పుడు ఫారంలో ₹6కు, రిటైల్‌లో ₹7కు చేరింది. పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చు పెరగడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.