News October 7, 2024

వచ్చే ఏడాది మూడు చోట్ల బీచ్ ఫెస్టివల్: మంత్రి దుర్గేశ్

image

AP: రుషికొండ నిర్మాణాలను ఎలా హ్యండిల్ చేయాలో అర్థం కావడం లేదని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. అవినీతి సామ్రాజ్యానికి సూచికగా రుషికొండలో మ్యూజియం ఏర్పాటు చేయాలేమోనని సెటైర్లు వేశారు. కొత్త టూరిజం పాలసీ రూపకల్పన జరుగుతోందన్నారు. దీనిలో భాగంగా స్వదేశీ దర్శన్, ప్రసాద్ స్కీం రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. వచ్చే ఏడాది విశాఖ, కాకినాడ, బాపట్లలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు.

Similar News

News March 9, 2026

T20WCలో భారత్ సరికొత్త చరిత్ర

image

* 3 T20WCలు సాధించిన తొలి జట్టు(2007, 2024, 2026).
* స్వదేశంలో టైటిల్ సాధించిన ఫస్ట్ టీమ్
* ఫైనల్‌లో తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం- 98 రన్స్
* నాకౌట్ మ్యాచుల్లో వేగంగా(7.2 ఓవర్లలో) 100 రన్స్
* పవర్ ప్లేలో అత్యధిక రన్స్ 92(విండీస్‌తో సమంగా)
* టాప్-3 బ్యాటర్లు(శాంసన్, అభిషేక్, ఇషాన్) హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి.

News March 9, 2026

PHOTOS: టీమ్‌ఇండియా సంబరాలు

image

2023 ODI WC ఓడిన చోటే(అహ్మదాబాద్ స్టేడియం) టీమ్‌ఇండియా టీ20 వరల్డ్ కప్‌ను గెలిచింది. ఆ గ్రౌండ్ కలిసిరాదని చాలా మంది గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ భారత జట్టు విజయకేతనం ఎగరవేసింది. ట్రోఫీ అందుకున్న అనంతరం ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పైన గ్యాలరీలో చూడండి.

News March 9, 2026

ఓటమిని ఓప్పుకోని యోధుడు ❤️‘సన్’జూ!

image

చీకటిని చీల్చి నిప్పులు కక్కుతూ సూర్యుడెలా ఉదయిస్తాడో సంజూ అలా వెలిగాడు ఈ WCలో. తొలుత జట్టులో చోటు దక్కకపోయినా నిరాశ చెందలేదు. తనకూ ఛాన్స్ వస్తుందనే ఓపికతో ముందుకు సాగారు. నిరీక్షణకు తెరపడగానే సింహంలా గర్జించారు. అది ఎంతలా అంటే 140 కోట్ల మంది భారతీయులు గర్వించేలా. IND జట్టు కప్పును ముద్దాడేలా. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమే. ఓటమిని ఒప్పుకోకుండా సంజూలా ముందుకు సాగడమే మనం నేర్చుకోవాలి. ఏమంటారు?