News July 5, 2024
BEAUTIFUL PHOTO: రజనీతో మోహన్ బాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720161613447-normal-WIFI.webp)
సూపర్ స్టార్ రజనీకాంత్తో విమానంలో దిగిన ఫొటోను డైలాగ్ కింగ్ మోహన్ బాబు ట్విటర్లో పంచుకున్నారు. ‘అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడైనా స్నేహమేరా జీవితం’ అని క్యాప్షన్ ఇచ్చారు. లోకేశ్తో తీసే సినిమా షూటింగ్ కోసం రజనీ హైదరాబాద్కు వచ్చారు. అదే సమయంలో చెన్నైలో జరిగిన వరలక్ష్మీ శరత్ కుమార్ రిసెప్షన్కు హాజరై మోహన్ బాబు కూడా HYDకి వచ్చారు. వీరిద్దరూ ఒకే విమానంలో ప్రయాణించడంతో ఇలా ఫొటో తీసుకున్నారు.
Similar News
News July 8, 2024
పప్పు TO బాలక్ బుద్ధి.. రాహుల్పై BJP కొత్త విమర్శలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720416402206-normal-WIFI.webp)
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ MP రాహుల్ గాంధీని విమర్శించడంలో BJP కొత్త పంథాను ఎంచుకుంది. గతంలో పప్పు అని విమర్శిస్తూ వచ్చిన BJP ఇప్పుడు కొత్తగా బాలక్ బుద్ధి అనే ట్యాగ్ ఇచ్చింది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని మోదీ ‘రాహుల్ పిల్ల చేష్టలు చేస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా రాహుల్పై ఆ ట్యాగ్లైన్తో BJPతో పాటు NDA కూటమి నేతలు సెటైర్లు వేస్తున్నారు.
News July 8, 2024
రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని YSR అనేవారు: CM రేవంత్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719469663218-normal-WIFI.webp)
TG: రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని దివంగత సీఎం YSR అనేవారని సీఎం రేవంత్ అన్నారు. ఈరోజు ప్రధాని పదవికి రాహుల్ అడుగుదూరంలో ఉన్నారని అభిప్రాయపడ్డారు. YSR జయంతి సందర్భంగా హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆయనకు నివాళులర్పించిన అనంతరం రేవంత్ మాట్లాడారు. రాహుల్ను ప్రధానిని చేసేందుకు ప్రయత్నించేవారే అసలైన YSR వారసులని సీఎం చెప్పుకొచ్చారు.
News July 8, 2024
OTTలోకి వచ్చేస్తున్న విజయ్ సేతుపతి సినిమా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720420067702-normal-WIFI.webp)
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం ‘మహారాజ’ ఈ నెల 12న ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో సూపర్ హిట్గా నిలిచిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సంస్థ తెలిపింది. కాగా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.