News September 5, 2025
అందమైన ముక్కోణం, అదిరే రుచి= సమోసా!

భారతీయులకు సమోసా ఓ ఎమోషన్. మధ్యప్రాచ్యానికి చెందిన ఈ స్నాక్ వ్యాపారులు, యాత్రికుల ద్వారా 13వ శతాబ్దంలో ఇండియాలోకి ప్రవేశించింది. మొఘల్ చక్రవర్తుల ఆస్థానంలో ఇది ఒక విలాసవంతమైన వంటకంగా ఉండేది. తొలుత సమోసాలో మాంసం ఉండేదట. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దీనిలో బంగాళాదుంపను పెట్టారు. ఈ మార్పుతో ఇది ప్రజలకు మరింత చేరువైంది. తక్కువ నూనెతో, ఎయిర్-ఫ్రైయర్తో చేసిన సమోసాలు తినడం మేలు. *వరల్డ్ సమోసా డే*
Similar News
News September 7, 2025
కొత్త సినిమా.. రూ.159 కోట్ల కలెక్షన్లు

కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో సూపర్ ఉమెన్ కథాంశంతో తెరకెక్కిన ‘కొత్త లోక’ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ 10 రోజుల్లోనే రూ.159+ కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్లో రూ.74 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.10.15 కోట్లు వసూలు చేసిందని వెల్లడించాయి. ఇప్పటికే రెట్టింపు లాభాలు వచ్చాయని పేర్కొన్నాయి. ఈ సినిమాకు హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించారు.
News September 7, 2025
చంద్రగ్రహణం.. తెరిచే ఉండనున్న శ్రీకాళహస్తి ఆలయం

AP: చంద్రగ్రహణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ మూసివేస్తే శ్రీకాళహస్తి టెంపుల్ మాత్రం తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో నవగ్రహ అలంకార కవచం వల్ల గ్రహణ ప్రభావం గుడిపై పడదని పండితులు చెబుతున్నారు. రోజులాగే రాత్రి 9 గంటలకు టెంపుల్ మూసివేసి, గ్రహణ సమయంలో రాత్రి 11 గంటలకు తెరిచి గ్రహణకాల అభిషేకాలు, శాంతిపూజలు నిర్వహిస్తారు. అయితే భక్తులకు రేపు ఉదయం 6 గంటలకు దర్శనం కల్పిస్తారు.
News September 7, 2025
జపాన్ ప్రధాని రాజీనామా

జపాన్ PM షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు. జులైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూటమి ఎగువ సభలో పరాజయం చెందింది. దీనికి బాధ్యత వహించాలంటూ ఆయనపై సొంత పార్టీ(లిబరల్ డెమోక్రటిక్) నేతల నుంచి ఒత్తిడి పెరిగింది. అంతర్గత విభేదాలకు స్వస్తి పలికేందుకు షిగెరు తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతమున్న సంకీర్ణ ప్రభుత్వం త్వరలోనే ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోనుంది.