News September 9, 2024
జగన్ చేసిన అప్పు వల్ల ఇప్పుడు నాకు ఇచ్చేవాళ్లు లేరు: సీఎం చంద్రబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92024/1725632133172-normal-WIFI.webp)
AP: విజయవాడలోని వరద ముంపు ప్రాంతాలైన భవానీపురం, ఊర్మిలానగర్లో CM చంద్రబాబు మరోసారి పర్యటించారు. అక్కడ ప్రజలతో మాట్లాడారు. ‘ప్రభుత్వానికి కూడా ఇబ్బందులున్నాయి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. జగన్ రూ.10.50 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లారు. నేను ఇప్పుడు అప్పు అడిగినా ఇచ్చేవాళ్లు లేరు. వరద తీవ్రత వల్ల అందరికీ పూర్తిగా సాయం చేయలేకపోయాం. నష్టపోయిన అందరికీ న్యాయం చేస్తాం’ అని తెలిపారు.
Similar News
News December 21, 2024
రేవంత్ను పిచ్చాసుపత్రిలో చూపించాలి: KTR
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734760099662_1045-normal-WIFI.webp)
TG: CM రేవంత్ పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద KTR విమర్శించారు. ‘ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చూపించాలని కుటుంబీకులను కోరుతున్నా. ఎవరినో కరిచేలా ఉన్నాడు’ అని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు రైతుబంధు లేదని, అరకొర రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని కోరారు. కాగా శాసనసభ నిరవధిక వాయిదా పడింది.
News December 21, 2024
జనవరి 2న క్యాబినెట్ భేటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733207472302_81-normal-WIFI.webp)
AP: జనవరి 2న సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు విషయాలపై మంత్రిమండలి చర్చించే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పోలవరం, అమరావతి పనులపై చర్చిస్తుందని సమాచారం.
News December 21, 2024
RGV ‘వ్యూహం’ మూవీకి నోటీసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734776503463_1032-normal-WIFI.webp)
డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన ‘వ్యూహం’ మూవీకి AP ఫైబర్ గ్రిడ్ లీగల్ నోటీసులు పంపింది. ఫైబర్ నెట్లో వ్యూస్ లేకున్నా రూ.1.15 కోట్లు లబ్ధి పొందడంతో RGVతోపాటు మరో ఐదుగురికి కూడా సమన్లు జారీ చేసింది. 15 రోజుల్లోగా వడ్డీతో సహా తీసుకున్న డబ్బును వెనక్కి కట్టాలని ఆదేశించింది. కాగా ఫైబర్ నెట్లో వ్యూహం సినిమాకు 1,816 వ్యూస్ రాగా అప్పటి ప్రభుత్వం రూ.1.15 కోట్లు చెల్లించిందని ఫైబర్ గ్రిడ్ ఆరోపించింది.