News April 10, 2025
అమెరికా వెళ్లే చైనీయులకు బీజింగ్ హెచ్చరికలు

అమెరికాలో ప్రయాణిస్తున్న, ప్రయాణించనున్న తమ దేశస్థులకు చైనా హెచ్చరికల్ని జారీ చేసింది. ‘అమెరికా-చైనా బంధం బలహీనపడటం, అమెరికా దేశీయ భద్రత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని USకి ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలి’ అని స్పష్టం చేసింది. అమెరికా, చైనా ప్రస్తుతం తీవ్రస్థాయి సుంకాల యుద్ధంలో ఉన్న సంగతి తెలిసిందే. చైనాపై మొత్తం సుంకాల్ని ట్రంప్ ఈరోజు 125శాతానికి పెంచారు.
Similar News
News April 18, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలో రానున్న 5రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీస్తాయంది. మరోవైపు, మిగతా ప్రాంతాల్లో రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది.
News April 18, 2025
రాష్ట్రంలో సహజ ప్రసవాలు అంతంతే..

AP: రాష్ట్రంలో సాధారణ ప్రసవాల కంటే శస్త్రచికిత్స ప్రసవాలు అధికమవుతున్నాయని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రైవేటుతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది. సాధ్యమైనంత వరకూ సహజ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని గైనకాలజిస్టులకు సూచించింది. తొలి కాన్పు సిజేరియన్ అయినప్పటికీ రెండో కాన్పు సహజ ప్రసవం చేసేలా చూడాలంది. కాగా సిజేరియన్లలో దేశంలోనే AP 2వ స్థానంలో ఉంది.
News April 18, 2025
ఆ కుక్క ధర రూ.50కోట్లు కాదు: ఈడీ

బెంగళూరుకు చెందిన సతీశ్ అనే వ్యక్తి ఇటీవల రూ.50కోట్లకు ఓ కుక్కను కొన్నారన్న వార్త SMలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అది కాస్తా ED దృష్టికి వెళ్లడంతో అతని ఇంటిపై దాడి చేసింది. రూ.50 కోట్లు ఎలా వచ్చాయనే లావాదేవీలపై విచారణ జరిపి, వాస్తవాలను బయటపెట్టింది. కాకేసియన్ షెపర్డ్ జాతికి చెందిన ఆ శునకం ధర రూ. లక్ష కూడా ఉండదని తేల్చి చెప్పింది. కేవలం ప్రచారం కోసమే అతను గొప్పలు చెప్పుకుంటున్నట్లు వివరించింది.