News March 17, 2024

జగన్‌తో స్నేహం చేసి కాంగ్రెస్‌పై విమర్శలా?: షర్మిల

image

AP: సీఎం జగన్, చంద్రబాబును రెండు పంజరాల్లో పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ అని APCC చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ‘పదేళ్ల రాష్ట్ర వినాశనంలో ముఖ్యపాత్ర పోషించి ఇప్పుడు నా మీద దాడులా. కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా? ఐదేళ్లుగా జగన్‌తో తెరచాటు స్నేహం నడిపారు. దత్తపుత్రుడు అన్నారు. జగన్ అరాచకాలకు అడ్డగోలు సహాయ సహకారాలు అందించి ఇప్పుడు కాంగ్రెస్ మీద పసలేని దాడులా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

Similar News

News September 30, 2024

‘టాక్సీవాలా’ డైరెక్టర్‌తో విజయ్ సినిమా.. షూట్ ఎప్పుడంటే?

image

విజయ్ దేవరకొండ, ‘టాక్సీవాలా’ సినిమా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. 1854-1878 కాలంలో ఈ మూవీ కథ జరుగుతుందని, అక్టోబర్‌లో లేదా నవంబర్ తొలి వారంలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. ఇందులో విజయ్ తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

News September 30, 2024

తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

image

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ CM చంద్రబాబు చేసిన ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చాలని, ఇందుకోసం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలని BJP సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేశారు. లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

News September 30, 2024

జయసూర్య వచ్చాడు.. జయాలు తెచ్చాడు!

image

గత కొన్నేళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న శ్రీలంక క్రికెట్ టీమ్ ఇప్పుడు వరుస విజయాలు నమోదు చేస్తోంది. ఈ క్రెడిట్ సనత్ జయసూర్యదేనని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఆయన తాత్కాలిక హెడ్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి ఆ జట్టు INDపై ODI సిరీస్, ENGలో ENGపై టెస్టు మ్యాచ్, తాజాగా NZపై టెస్ట్ సిరీస్ గెలిచింది. దీంతో ఆ దేశ క్రికెట్‌లో కొత్త శకం మొదలైందని పలువురు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.