News March 22, 2024

నమ్మిన వారే గొంతు కోశారు: MLA నల్లపురెడ్డి

image

AP: తాను నమ్మిన నాయకులే గొంతు కోశారని కోవూరు MLA నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కొందరు నేతలు తనను అడ్డం పెట్టుకుని బాగా సంపాదించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు వారంతా టీడీపీ MP అభ్యర్థి వేమిరెడ్డి పంచన చేరుతున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో వారందరికీ తానేంటో చూపిస్తానని హెచ్చరించారు. తాను నోరు విప్పితే వేమిరెడ్డి జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోనే ఉండరన్నారు.

Similar News

News February 9, 2026

‘సావర్కర్‌కు భారతరత్న’పై మాటల మంటలు

image

వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న RSS చీఫ్ మోహన్ భాగవత్ కామెంట్స్‌తో మరోసారి చర్చ మొదలైంది. అసలు ఆయన దేశానికి ఏం సేవ చేశారని ఆ బిరుదు ఇవ్వాలని కాంగ్రెస్, MIM ఘాటుగా ప్రశ్నించాయి. అటు భారతరత్న కంటే సావర్కర్‌ది ఎంతో పెద్ద స్థాయి అని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కామెంట్ చేశారు. సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

News February 9, 2026

పిల్లల SM వాడకంపై నియంత్రణకు ప్రణాళికలు: CBN

image

AP: పిల్లలకు సోషల్ మీడియా నుంచి రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు CM చంద్రబాబు తెలిపారు. మంత్రులు, కార్యదర్శులు, శాంతి భద్రతలపై DGP, SPలతో సమావేశమయ్యారు. ’16 ఏళ్లలోపు పిల్లలు SM వాడకాన్ని నియంత్రించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించాలి. మద్యం, డ్రగ్స్‌కు బానిసైన వారిని మార్చేలా చర్యలు తీసుకోవాలి. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలి’ అని సూచించారు.

News February 9, 2026

500 ఎకరాల్లో ఇల్లు.. ఎక్కడుందో తెలుసా?

image

ప్రపంచంలోనే అతిపెద్ద ఇళ్లలో ఒకటిగా పేరొందిన లక్ష్మీవిలాస్ ప్యాలెస్ వడోదరాలో (GJ) ఉంది. 19వ శతాబ్దం చివరలో గైక్వాడ్ రాజకుటుంబం కోసం బ్రిటిష్ ఆర్కిటెక్ట్ రాబర్ట్ చిసోమ్ దీనిని డిజైన్ చేశారు. 500 ఎకరాలకు పైగా ఉండే ఈ ప్యాలెస్‌లో మ్యూజియంలు, గార్డెన్లు, రవి వర్మ పెయింటింగ్స్‌, గోల్ఫ్ క్లబ్ ఉన్నాయి. ఇందులో ఇప్పటికీ రాజకుటుంబీకులు నివసిస్తున్నప్పటికీ పబ్లిక్‌ దీనిని చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.