News July 26, 2024
రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉందని నమ్మిస్తున్నారు: జగన్

AP: వంచన, గోబెల్స్ సిద్ధాంతాన్నే చంద్రబాబు నమ్ముకున్నారని, ఆయన ఏది చెబితే దాన్ని ఎల్లోమీడియా ప్రచారం చేస్తోందని మాజీ CM జగన్ విమర్శించారు. ‘రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉందని ప్రజలను నమ్మిస్తున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయాల్సి వస్తుందని ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. బడ్జెట్లో అప్పు చూపించలేక పడరాని పాట్లు పడుతున్నారు’ అని జగన్ ఎద్దేవా చేశారు.
Similar News
News November 26, 2025
మిరపలో కొమ్మ ఎండు, కాయ కుళ్లు తెగులు – నివారణ

మిరపలో ఈ తెగులు తొలుత లేత కొమ్మలు, పూతకు ఆశించడం వల్ల పూత రాలి, చివర్ల నుంచి కొమ్మలు కిందకు ఎండుతాయి. కాయలను ఆశించడం వల్ల కాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి, కుళ్లి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో డైఫెనోకోనజోల్ 25% EC 100ml లేదా క్రెసోక్సిమ్-మిథైల్ 44.3% SC 200mlలలో ఏదో ఒకటి కలిపి పిచికారీ చేయాలి. తెగులు సోకిన మొక్కల భాగాలను సేకరించి నాశనం చేయాలి.
News November 26, 2025
ఏంటి బ్రో.. కనీస పోటీ ఇవ్వలేరా?

సొంత గడ్డపై సౌతాఫ్రికా చేతిలో 2 టెస్టుల్లోనూ ఓడిపోవడాన్ని IND ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస పోటీ ఇవ్వకుండా చేతులెత్తేయడంపై మండిపడుతున్నారు. టెస్టులకు అవసరమైన ఓర్పు, సహనం మన క్రికెటర్లలో లోపించాయంటున్నారు. అలాగే కోచ్ గంభీర్ పనితీరూ సరిగా లేదని చెబుతున్నారు. ఆయన హయాంలోనే స్వదేశంలో NZ చేతిలో 3-0, ఆస్ట్రేలియాలో 1-3, ఇప్పుడు SA చేతిలో 0-2 తేడాతో పరాజయాలు పలకరించాయని గుర్తు చేస్తున్నారు.
News November 26, 2025
తుఫాను ముప్పు తప్పింది.. అల్పపీడనం దూసుకొస్తోంది

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన సెన్యార్ తుఫాను ఇండోనేషియా వైపు పయనిస్తోంది. దీంతో రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పిందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపారు. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడి ఈ నెల 29న తమిళనాడు వద్ద తీరం దాటుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.


