News August 26, 2024

బెంగాల్‌కు 123 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు.. పనిచేస్తున్నవి 6 మాత్రమే

image

చిన్నారులు, మహిళలపై వేధింపులు, అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై విచార‌ణ జరపడానికి బెంగాల్‌కు 123 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు మంజూరు చేస్తే అందులో 6 పోక్సో కోర్టులు మాత్ర‌మే ప‌నిచేస్తున్న‌ట్టు కేంద్రం తెలిపింది. ఇటీవ‌ల ప్ర‌ధానికి CM మ‌మ‌తా బెనర్జీ రాసిన లేఖ‌పై కేంద్ర మంత్రి అన్న‌పూర్ణా దేవీ ఘాటుగా బ‌దులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల 48,600 అత్యాచారం, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు.

Similar News

News November 18, 2025

ఆదిలాబాద్: మళ్లీ ఆశల చిగురింత

image

స్థానిక పోరుపై ఆశలు వదులుకున్న గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి ADB జిల్లాలో సందడి మొదలైంది. ఇకేంముంది మళ్లీ చర్చలు మొదలయ్యాయి. రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో నిరాశ చెందిన ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. రిజర్వేషన్లు మారనున్న నేపథ్యంలో పోటీ చేయడానికి ఆశావహులు సిద్ధం అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1514 గ్రామ పంచాయతీలు, 581 MPTC, 69 ZPTC స్థానాలున్నాయి.

News November 18, 2025

కేరళ రూల్ మన దగ్గరా కావాలని డిమాండ్!

image

ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలొస్తున్నాయి. ఇక్కడి రెస్టారెంట్లలో వంట నూనెను మూడు సార్లు కంటే ఎక్కువ ఉపయోగిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు. నూనెను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా రెస్టారెంట్లలోనూ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని, అధికారులు కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. మీకామెంట్?

News November 18, 2025

కేరళ రూల్ మన దగ్గరా కావాలని డిమాండ్!

image

ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలొస్తున్నాయి. ఇక్కడి రెస్టారెంట్లలో వంట నూనెను మూడు సార్లు కంటే ఎక్కువ ఉపయోగిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు. నూనెను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా రెస్టారెంట్లలోనూ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని, అధికారులు కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. మీకామెంట్?