News September 5, 2025
జాతీయ అవార్డులు అందుకున్న ఉత్తమ తెలుగు టీచర్లు

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా 45 మంది టీచర్లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏపీ నుంచి తిరుమల శ్రీదేవి(HM-పండిట్ నెహ్రూ GVMC మున్సిపల్ హైస్కూల్), తెలంగాణ నుంచి పవిత్ర(పెన్పహడ్ స్కూల్) అవార్డు అందుకున్నారు. ఇక ప్రొఫెసర్ విభాగంలో ఏపీకి చెందిన ప్రొ.విజయలక్ష్మి, దేవానందకుమార్, TG నుంచి గోయల్, వినీత్ అవార్డులు స్వీకరించారు.
Similar News
News September 7, 2025
సీఎం కలల ప్రాజెక్టు గురించి తెలుసా?

TG: సీఎం రేవంత్ కలల ప్రాజెక్టుగా ఉన్న <<17640080>>మూసీ<<>> పునరుజ్జీవన పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2024లోనే CM ప్రకటన చేశారు. తర్వాత నది తీర ప్రాజెక్టుల అధ్యయనానికి రేవంత్ బృందం UK, దక్షిణ కొరియాలో పర్యటించింది. ఆక్రమణల తొలగింపుపై వ్యతిరేకత నడుమ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ADB ₹4,100 కోట్ల రుణాన్ని ప్రకటించింది. మరోవైపు ప్రధాన భాగాలకు సంబంధించి మూడు DPRలు ఫైనల్ స్టేజీలో ఉన్నాయి.
News September 7, 2025
దేశ ప్రయోజనాల కోసం ఓటేయండి: జస్టిస్ సుదర్శన్ రెడ్డి

ఎంపీలంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కోరారు. త్వరలో జరగబోయే ఎన్నికను కేవలం ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికగా చూడొద్దని కోరారు. ఎంపీలు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాశారు. పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా దేశం కోసం ఓటేయాలని కోరారు. ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.
News September 7, 2025
చదువుకు పర్యాయపదం చంద్రబాబు: టీడీపీ

AP: మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరమంటూ వైసీపీ చేస్తున్న విమర్శలకు TDP దీటుగా బదులిచ్చింది. ‘30 ఇంజినీరింగ్ కాలేజీలు లేనిచోట 300కు పైగా నెలకొల్పింది చంద్రబాబు. DSCలతో 2 లక్షల మంది టీచర్లను నియమించారు. ISB, IIIT, NAC, NALSAR, BITS లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను తీసుకొచ్చారు. 27 మెడికల్ కాలేజీలు తెచ్చి, 5015 MBBS సీట్లు తీసుకొచ్చారు. జగన్ తెచ్చింది 950 సీట్లే. చదువుకు CBN పర్యాయపదం’ అని Xలో పేర్కొంది.