News October 23, 2024
ప్రియాంకా గాంధీకి బెస్ట్ విషెస్: సీఎం రేవంత్

కేరళలోని వయనాడ్ లోక్సభ ఉపఎన్నికకు ఇవాళ నామినేషన్ వేసిన ప్రియాంకా గాంధీకి సీఎం రేవంత్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘ప్రియాంకా గాంధీకి మనస్ఫూర్తిగా విషెస్ చెబుతున్నాను. ఆమె తన శక్తిమంతమైన స్వరంతో ప్రజల ఆకాంక్షలను పార్లమెంటులో గట్టిగా వినిపిస్తారని నేను నమ్ముతున్నాను’ అని ట్వీట్ చేశారు. ప్రియాంక నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కేరళకు వెళ్లిన సంగతి తెలిసిందే.
Similar News
News January 22, 2026
భోజ్శాలలో సరస్వతీ పూజ, నమాజ్కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ధార్(MP)లోని వివాదాస్పద భోజ్శాల కాంప్లెక్స్లో రేపు (జనవరి 23) వసంత పంచమి సరస్వతీ పూజ, నమాజ్ రెండూ జరుపుకొనేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అవకాశమిచ్చింది. హిందువులు రోజంతా పూజలు నిర్వహించుకోవడానికి అనుమతించింది. ఇద్దరికీ వేర్వేరు దారులు ఉండేలా చూడాలని, ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించింది.
News January 22, 2026
అక్రమ సంబంధాలు.. కుటుంబాలు నాశనం!

కొందరు మహిళలు అక్రమ సంబంధాలకు అలవాటుపడి పచ్చని కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. HYD కూకట్పల్లిలో ప్రసన్న భర్త మెడకు చున్నీ బిగించి చంపేయగా, గుంటూరు(D) చిలువూరులో భార్య లక్ష్మి భర్తను ఊపిరాడకుండా చేసి హతమార్చింది. అటు భార్యలపై అనుమానాలతో భర్తలు వారిని చంపుతున్న ఘటనలూ పెరిగిపోయాయి. HYD రహ్మత్నగర్లో భర్త ఆంజనేయులు భార్య సరస్వతిని, అనంతపురంలో వీరాంజనేయులు తన భార్య లక్ష్మిని చంపేశారు.
News January 22, 2026
నైనీ కోల్ బ్లాక్ అంశం.. కేంద్ర బృందం విచారణ

TG: రాష్ట్రంలో సంచలనంగా మారిన నైనీ కోల్ బ్లాక్ అంశంపై కేంద్రం దృష్టిసారించినట్లు తెలుస్తోంది. బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో కేంద్ర బృందం విచారణ జరపనుంది. ఇద్దరు సభ్యుల బృందం త్వరలోనే సింగరేణిలో పర్యటించనుంది. ఈ బృందం సింగరేణి అధికారులతో కలిసి విచారణ చేపట్టనుంది. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అంశంలో ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే.


