News May 16, 2024
‘ఆ విధానం మార్చుకుంటే బెటర్’.. NBFCలకు ఆర్బీఐ సూచన

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు లోన్లు మంజూరు చేసేందుకు ఆల్గారిథమ్స్పై ఆధారపడటం తగ్గించుకుంటే మంచిదని RBI హెచ్చరించింది. లబ్ధిదారుడి రికార్డ్లో ఉన్న డేటాను మాత్రమే ఆల్గారిథమ్స్ పరిగణనలోకి తీసుకుంటాయనే విషయం గుర్తించాలని సూచించింది. క్రెడిట్ అసెస్మెంట్ను కేవలం దీని ఆధారంగా అంచనా వేయడం సరికాదంది. లోన్స్ త్వరగా మంజూరు చేసేందుకు సంస్థలు ఈ పద్ధతిని అనుసరిస్తున్న నేపథ్యంలో RBI ఈ సూచనలు చేసింది.
Similar News
News February 10, 2026
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 202 పాయింట్లు పుంజుకొని 84,267 వద్ద.. నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 25,917 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, NTPC షేర్లు లాభాల్లో.. బజాజ్ ఫైనాన్స్, HCL టెక్, ఇండిగో, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన సూచీలను ప్రభావితం చేస్తున్నాయి.
News February 10, 2026
నియోనాటల్ పీరియడ్

బిడ్డ పుట్టిన మొదటి 28 రోజులు కీలక సమయం. దీన్ని నియోనాటల్ పీరియడ్ అంటారు. ఈ సమయంలో సంరక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా బిడ్డ ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు. నియోనాటల్ పీరియడ్లో బిడ్డకు అనారోగ్యాల ప్రమాదం తగ్గించడం, పెరుగుదలను ప్రోత్సహించడం కోసం స్పెషల్ కేర్ అవసరం. బిడ్డను వెచ్చగా ఉంచడం, శ్వాస సరిగా తీసుకునేలా చేయడం, తల్లి పాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటం ముఖ్యమని చెబుతున్నారు.
News February 10, 2026
పంట నుంచి పత్తి తీసేటప్పుడు ఈ తప్పులు వద్దు

కొన్నిసార్లు కొన్ని పత్తి కాయలు పగిలి, మరికొన్ని పగలకుండా ఉంటాయి. అప్పుడు వాటిని కోసేందుకు రైతులు 2,3 రోజులు ఆగుతారు. అయితే అకాల వర్షాలు, మంచు వల్ల అప్పటికే పగిలిన పత్తి కూడా రంగు మారి, నాణ్యత దెబ్బతినే ఛాన్సుంది. అందుకే పగిలిన కాయల నుంచి పత్తిని వెంటనే తీసేయాలి. పూర్తిగా పగలని కాయల నుంచి పత్తిని తీస్తే అది ముడిపత్తిలాగా ఉండి, నాణ్యమైన పత్తితో కలిపి మార్కెట్ చేసినపుడు ధర కోల్పోయే ప్రమాదం ఉంది.


