News December 24, 2024
శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు: బీఆర్ నాయుడు

శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవల్ని అందిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు. ఈరోజు జరిగిన TTD ధర్మకర్తల మండలి సమావేశంలో ‘స్విమ్స్కు జాతీయ హోదాకు సిఫార్సు, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీనివాసుడి ఆలయాల నిర్మాణం, ఒంటిమిట్ట కోదండ రామాలయ విమాన గోపురానికి రూ.43 లక్షలతో బంగారు కలశం, తిరుమలలో ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ విభాగం’ నిర్ణయాలను తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News November 7, 2025
వంటింటి చిట్కాలు

* కూరలో పులుపు తక్కువైతే మామిడిపొడితో పాటు కొంచెం పెరుగు వేస్తే టమోటా రుచి వస్తుంది.
* పెరుగుపచ్చడి రుచిగా ఉండాలంటే తాలింపు పెట్టేప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి.
* కట్ చేసిన బెండకాయల మీద నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయలమీద జిగురు ఉండదు.
* వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది.
News November 7, 2025
కరివేపాకు సాగు.. పొలం తయారీ, నాటే విధానం

కరివేపాకు సాగు చేయదలచే రైతులు విత్తనాన్ని నేరుగా భూమిలో నాటడం వల్ల మొక్క పెరుగుదలలో లోపాలు రావొచ్చు. దీనికి బదులు 1 నుంచి 1.5 సంవత్సరాల మొక్కలను వర్షాకాలంలో నాటితే మంచి ఫలితాలు పొందొచ్చు. నాటే ముందు నేలను 4-5 సార్లు బాగా దుక్కివచ్చే వరకు దున్నాలి. 45X45X45 సెం.మీ గుంతలను 1X1 మీటర్ల దూరంలో తీయాలి. ప్రతి గుంతకు పశువుల ఎరువు 10 కిలోల చొప్పున వేయాలి. ఒక హెక్టారుకు 10వేల మొక్కలను నాటుకోవచ్చు.
News November 7, 2025
దక్షిణ మధ్య రైల్వేలో 61 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


