News March 23, 2025

బెట్టింగ్ యాప్.. ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్‌పై ఫిర్యాదు

image

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేస్తున్నారంటూ టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్‌లపై హైదరాబాద్‌ పోలీసులకు రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఓ బెట్టింగ్ యాప్‌కు వీరు ముగ్గురు ప్రమోషన్లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చాలా మంది యువకులు డబ్బులు పోగొట్టుకున్నారని ఆరోపించారు. కాగా ఇటీవల దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండపై కూడా ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News March 25, 2025

AP EAPCETకు 1.12లక్షల దరఖాస్తులు

image

ఏపీ ఈఏపీసెట్‌కు ఇప్పటివరకు 1,12,606 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 15న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 24 వరకు కొనసాగనుంది. అపరాధ రుసుముతో మే 16 వరకు అప్లై చేసుకోవచ్చు. మే 19 నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.

News March 25, 2025

IPL: నేడు గుజరాత్‌తో పంజాబ్ ఢీ

image

IPLలో ఇవాళ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 5 మ్యాచుల్లో తలపడ్డాయి. GT 3, PBKS 2 మ్యాచుల్లో గెలిచాయి. గత సీజన్‌లో KKRకు కప్ సాధించి పెట్టిన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్‌లో PBKSకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. GTకి గిల్ కెప్టెన్‌గా ఉన్నారు. మరి ఈ మ్యాచులో గెలుపెవరిది? కామెంట్ చేయండి.

News March 25, 2025

తెలంగాణ రాష్ట్ర అప్పు ఎంతంటే?

image

తెలంగాణకు ₹4,42,298 కోట్ల అప్పులు ఉన్నాయని కేంద్రం లోక్ సభలో వెల్లడించింది. ఈ విషయంలో దేశంలో TG 24వ స్థానంలో ఉందని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అలాగే రాష్ట్రంలో గత 6 ఏళ్లలో 10,189 IT కంపెనీలు ప్రారంభమయ్యాయని కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా తెలిపారు. ఇదే సమయంలో 3,369 సంస్థలు మూతపడ్డాయని పేర్కొన్నారు. ఈ కంపెనీల ద్వారా గత ఐదేళ్లలో ₹14,865కోట్ల టర్నోవర్ జరిగిందని వివరించారు.

error: Content is protected !!