News May 12, 2024
బెట్టింగులే.. బెట్టింగులు

ఉత్కంఠ రేపుతున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు ఓ రేంజ్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది?, మెజార్టీలు, ప్రముఖ నాయకుల గెలుపోటములపై బెట్టింగ్ బాబులు భారీగా పందేలు వేస్తున్నారట. పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, నగరి, నెల్లూరు రూరల్, చీరాల, దర్శి, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్, సత్తెనపల్లి, ఆళ్లగడ్డ నియోజకవర్గాలు పందేలకు హాట్సీట్లుగా మారాయని సమాచారం.
Similar News
News October 12, 2025
అంతరిక్షం నుంచి హిమాలయాల అందాలు!

నాసా వ్యోమగామి డాన్ పెట్టిట్ అంతరిక్షం నుంచి తీసిన హిమాలయ పర్వతాల ఫొటో SMలో వైరల్ అవుతోంది. తెల్లటి మంచు, మేఘాలతో కనుచూపు మేర ఉన్న పర్వతాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ ఫొటోలో హిమాలయాలతో పాటు ఎవరెస్ట్ పర్వతం, నేపాల్ భూభాగం సైతం కనిపిస్తోందని వ్యోమగామి వెల్లడించారు. ఇటీవల బిహార్లోని జైనగర్ నుంచి ఎవరెస్టు పర్వత అందాలు కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.
News October 12, 2025
రేపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు: APSDMA

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. సోమవారం అల్లూరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News October 12, 2025
మా పార్టీ వాళ్లనూ సస్పెండ్ చేశాం: చంద్రబాబు

AP: కొందరు రాజకీయ ముసుగులో నేరాలు చేయడానికి అలవాటు పడ్డారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘నకిలీ మద్యం కేసులో మా పార్టీ వాళ్లపై ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశాం. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించాం. 16 మందిని అరెస్ట్ చేశాం. ఇబ్రహీంపట్నం కేసులోనూ 12 మంది నిందితులను గుర్తించగా ఏడుగురిని అరెస్టు చేశారు. 4 పీటీ వారెంట్లు నమోదయ్యాయి’ అని సీఎం వివరించారు.