News May 12, 2024
బెట్టింగులే.. బెట్టింగులు

ఉత్కంఠ రేపుతున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు ఓ రేంజ్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది?, మెజార్టీలు, ప్రముఖ నాయకుల గెలుపోటములపై బెట్టింగ్ బాబులు భారీగా పందేలు వేస్తున్నారట. పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, నగరి, నెల్లూరు రూరల్, చీరాల, దర్శి, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్, సత్తెనపల్లి, ఆళ్లగడ్డ నియోజకవర్గాలు పందేలకు హాట్సీట్లుగా మారాయని సమాచారం.
Similar News
News October 10, 2025
ఘరానా మోసం.. రూ.18 కోట్లు వసూలు చేసిన కిలేడి

సంగారెడ్డి(D) పటాన్చెరులో ఘరానా మోసానికి పాల్పడిందో కిలేడి. కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు వస్తోందని, కంటైనర్లను కొనడానికి డబ్బు అవసరమని విద్య పలువురి వద్ద కోట్లు వసూలు చేసింది. రూ.35 వేలకే తులం బంగారం ఇస్తానని మరికొందరి నుంచి డబ్బు తీసుకుంది. ఇలా మొత్తంగా రూ.18 కోట్లు దండుకుంది. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగిన బాధితులను అనుచరులతో కొట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 10, 2025
మార్కెట్ కమిటీలు, రైతు బజార్లపై కీలక సూచన

AP: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, రైతు బజార్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు బజార్లను అనుసంధానం చేసి ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 218 మార్కెట్ కమిటీల స్థలాల్లో అగ్రి ప్రాసెసింగ్ యూనిట్స్, కోల్డ్ చైన్ ఏర్పాటు చేయాలని.. రైతులు, వినియోగదారులు లాభపడేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.
News October 10, 2025
AP అప్డేట్స్ @10AM

*రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్యసేవలు. ఎమర్జెన్సీ సహా అన్నిరకాల వైద్యసేవలను నెట్వర్క్ ఆస్పత్రులు నిలిపివేశాయి. రూ.650 కోట్ల బకాయిలు విడుదల చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని నిర్ణయించాయి.
*మంత్రివర్గ సమావేశం ప్రారంభం. 30 అంశాలపై చర్చ. రూ.1,14,821 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.
*ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని పొగాకు పరిశ్రమలో అగ్నిప్రమాదం. రూ.500 కోట్ల నష్టమని అంచనా.