News May 12, 2024
బెట్టింగులే.. బెట్టింగులు

ఉత్కంఠ రేపుతున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు ఓ రేంజ్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది?, మెజార్టీలు, ప్రముఖ నాయకుల గెలుపోటములపై బెట్టింగ్ బాబులు భారీగా పందేలు వేస్తున్నారట. పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, నగరి, నెల్లూరు రూరల్, చీరాల, దర్శి, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్, సత్తెనపల్లి, ఆళ్లగడ్డ నియోజకవర్గాలు పందేలకు హాట్సీట్లుగా మారాయని సమాచారం.
Similar News
News October 12, 2025
తిరుమలలో రద్దీ.. దర్శనానికి 24 గంటలు

AP: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న 84,571 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
News October 12, 2025
వరిలో పాముపొడ, ఆకుముడత తెగుళ్లు.. నివారణ

ముందుగా సాగుచేసిన వరిలో పాముపొడ తెగులు కనిపిస్తోంది. దీని నివారణకు ఎకరానికి 400 మి.లీ హెక్సాకొనజోల్ 5 SP లేదా 400 మి.లీ వాలిడామైసిన్ 3 SL లేదా 200 మి.లీ ప్రోపికొనజోల్ 25 శాతం EC వంటి మందులను పిచికారీ చేసుకోవాలి. ఆకుముడత, కాండం తొలుచు పురుగుల నివారణకు ఎకరానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400గ్రా. లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 60 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
News October 12, 2025
పరీక్ష రాశాక ఆన్సర్ షీట్ చూసుకోవచ్చు

పోటీ పరీక్షల్లో పారదర్శకత కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ముఖ్య సంస్కరణలు చేసింది. ఇకపై మెరిట్ లిస్టును మార్కులుగా కాకుండా పర్సంటైల్గా వెల్లడిస్తుంది. అటు పేపర్ లీకేజీలు జరగకుండా డిజిటల్ వాల్టులు వినియోగించనుంది. ఇక ఆధార్ గుర్తింపుతో అభ్యర్థుల అటెండెన్స్ తీసుకుంటుంది. ముఖ్యంగా ఎగ్జామ్లో తమకు వచ్చిన క్వశ్చన్ పేపర్, ఇచ్చిన ఆన్సర్స్, కీ కాపీలను పరీక్ష తర్వాత ఆన్లైన్లో చూసుకోవచ్చని తెలిపింది.