News May 12, 2024
బెట్టింగులే.. బెట్టింగులు

ఉత్కంఠ రేపుతున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు ఓ రేంజ్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది?, మెజార్టీలు, ప్రముఖ నాయకుల గెలుపోటములపై బెట్టింగ్ బాబులు భారీగా పందేలు వేస్తున్నారట. పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, నగరి, నెల్లూరు రూరల్, చీరాల, దర్శి, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్, సత్తెనపల్లి, ఆళ్లగడ్డ నియోజకవర్గాలు పందేలకు హాట్సీట్లుగా మారాయని సమాచారం.
Similar News
News October 7, 2025
స్పోర్ట్స్ న్యూస్ అప్డేట్స్

* ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్కు నామినేట్ అయిన అభిషేక్ శర్మ, కుల్దీప్, బ్రయాన్(ZIM)
* DGCA డ్రోన్ పైలట్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసినట్లు ప్రకటించిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ
* సియట్ అవార్డ్స్లో సంజూ శాంసన్ టీ20 బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, శ్రేయస్ అయ్యర్ స్పెషల్ అవార్డ్ అందుకున్నారు.
* ఆస్ట్రేలియాపై ఆడడం తనకు ఇష్టమని, అక్కడి ప్రజలు క్రికెట్ను ఎంతో ప్రేమిస్తారన్న రోహిత్ శర్మ
News October 7, 2025
జగన్ వస్తే.. నేనూ వస్తా: సత్యకుమార్

AP: నర్సీపట్నం మెడికల్ కాలేజీ పరిశీలనకు జగన్ వస్తే తానూ వచ్చి పరిస్థితిని వివరిస్తానని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలను గత ప్రభుత్వం విస్మరించిందని, ఆ పాపం ఇప్పుడు తమకు శాపంగా మారిందని దుయ్యబట్టారు. ప్రజలు గుణపాఠం చెప్పినా జగన్లో మార్పు రావడం లేదని సత్యకుమార్ మండిపడ్డారు. వైసీపీ నేతలకు పీపీపీకి, ప్రైవేటైజేషన్కు మధ్య తేడా తెలియదని ఎద్దేవా చేశారు.
News October 7, 2025
కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ సంతకాల సేకరణ

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అక్టోబర్ 10 నుంచి ప్రజా ఉద్యమం చేయనున్నట్లు YCP చీఫ్ వైఎస్ జగన్ వెల్లడించారు. దీనిపై కార్యాచరణ ప్రకటించారు. కోటి సంతకాల సేకరణకు ఈనెల 10 నుంచి 22 వరకు గ్రామ, వార్డు స్థాయిల్లో రచ్చబండ, 28న నియోజకవర్గ, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సంతకాల పత్రాలు NOV 23న జిల్లా కేంద్రాలకు, 24న విజయవాడకు చేర్చాలని తెలిపారు. తర్వాత వాటిని గవర్నర్కు సమర్పిస్తామని చెప్పారు.