News March 31, 2024
వాలంటీర్లూ జర జాగ్రత్త
AP: వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ సస్పెన్షన్కు గురవుతున్న సంఘటనలు చూస్తున్నాం. అయితే ఇది వారి భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు విశ్లేషకులు. చాలా మంది వాలంటీర్లుగా పని చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. పబ్లిక్ సర్వెంట్ కేటగిరీలోకి వచ్చే వీరిపై ఎన్నికల సంఘం ఆదేశాలతో సస్పెన్షన్ వేటు పడినా, ఉద్యోగం కోల్పోయినా ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరిస్తున్నారు.
Similar News
News October 6, 2024
నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు
TG: నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ 2024-25 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 14 వరకు ఆన్లైన్లో <
News October 6, 2024
హరియాణాలో మాదే అధికారం: సీఎం సైనీ
హరియాణాలో ఎగ్జిట్ పోల్స్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ తిరిగి తామే అధికారంలోకి వస్తామని సీఎం నయబ్ సింగ్ సైనీ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. తాము అన్ని రంగాల్లో పనులు చేశామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించారని పేర్కొన్నారు. హరియాణాను వారసత్వం, ప్రాంతీయతత్వం నుంచి వేరు చేసినట్లు పేర్కొన్నారు. కాగా 90 స్థానాలకు ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
News October 6, 2024
తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారు: సినీ రచయిత
డబ్బింగ్ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టకుండా విడుదల చేసి తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారని సినీ రచయిత అబ్బూరి రవి ట్వీట్ చేశారు. ఇతర భాషా చిత్రాల గొప్పదనాన్ని, కళాత్మకతని తాను గౌరవిస్తానని తెలిపారు. తెలుగుని గౌరవించని వారి చిత్రాలను చూసేందుకు డబ్బులు ఖర్చుచేయడం గొప్పతనమని తాను అనుకోవట్లేదన్నారు. కాగా రజినీ ‘వేట్టయాన్’ మూవీ అదే పేరుతో తెలుగులో రిలీజ్ కానుండటం చర్చనీయాంశంగా మారింది.