News October 31, 2024
‘ఇంతకు మించి’.. చైనా సమస్యపై రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు

LAC వద్ద భారత్, చైనా సైనికుల ఉపసంహరణ దాదాపుగా ముగిసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. డ్రాగన్ కంట్రీతో ‘ఇంతకు మించి’ పరిష్కారాలను కోరుకుంటున్నామని, అందుకు కాస్త సమయం పడుతుందని వెల్లడించారు. అరుణాచల్లోని తవాంగ్లో ఆయన సర్దార్ పటేల్ జయంతి, దీపావళిని సైనికులతో కలిసి జరుపుకున్నారు. మేజర్ బాబ్ ఖాథింగ్ శౌర్య మ్యూజియాన్ని ఆరంభించారు. ఈశాన్య భారతం భద్రతకు ఆయనెంతగానో కృషి చేశారని గుర్తుచేశారు.
Similar News
News February 2, 2026
173 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News February 2, 2026
మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లివే..

మహిళలకు వచ్చే క్యాన్సర్ వ్యాధుల్లో సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్. వీటితోపాటు యూట్రస్ క్యాన్సర్, అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News February 2, 2026
బియ్యపు పిండి దీపంతో అష్టైశ్వర్య ప్రాప్తి

సర్వసాధారణంగా, అత్యంత శక్తివంతంగా వాడేది బియ్యపు పిండి దీపం. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర వచనం. లక్ష్మీదేవి ముందు ప్రతిరోజు బియ్యపు పిండి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోతాయి. జాతకంలోని రాహు-కేతు దోషాల నివారణకు కూడా ఈ దీపం రామబాణంలా పనిచేస్తుంది. కుటుంబంలో అభివృద్ధి, సంతాన సౌఖ్యం, నిరంతర సంపద కోరుకునే వారు ఈ దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం.


